వంట గదిలో భోజనం చేస్తున్న భర్త.. మంటల్లో చిక్కుకోవడంతో.. అక్కడే ఉన్న భార్య చివరకు షాకింగ్ నిర్ణయం..

ABN , First Publish Date - 2022-11-15T17:40:23+05:30 IST

చీటికీమాటికీ గొడవపడే దంపతులతో పాటూ అన్యోన్యంగా జీవించే భార్యాభర్తలు కూడా చాలా మంది ఉంటారు. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా ఇంకొకరు తట్టుకోలేరు. భర్త సమస్యల్లో..

వంట గదిలో భోజనం చేస్తున్న భర్త.. మంటల్లో చిక్కుకోవడంతో.. అక్కడే ఉన్న భార్య చివరకు షాకింగ్ నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం

చీటికీమాటికీ గొడవపడే దంపతులతో పాటూ అన్యోన్యంగా జీవించే భార్యాభర్తలు కూడా చాలా మంది ఉంటారు. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా ఇంకొకరు తట్టుకోలేరు. భర్త సమస్యల్లో ఉన్నప్పుడు భార్య, భార్య ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భర్త.. అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకు వెనుకాడరు. ఎన్నో ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న భర్తను కాపాండేందుకు భార్య.. భార్య చనిపోవడంతో తానూ బతకనంటూ విష గులికలు తిన్న భర్త.. ఉదంతాలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రియుడితో కలిసి భర్త ప్రాణం తీసింది.. నాలుగు సంవత్సరాల తర్వాత గుట్టు బైటపడింది..

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) హమీర్‌పూర్ జిల్లా భరుసుమేర్‌పూర్ పరిధి పచ్‌ఖురా ఖుర్ద్ గ్రామంలో రాహుల్, స్వప్న దంపతులు (couple) నివాసం ఉంటున్నారు. శనివారం ఇంట్లో సరదాగా గడిపారు. అయితే మరుసటి రోజు తమ ఇంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని ఊహించలేకపోయారు. ఆదివారం ఉదయం 8గంటల సమయంలో స్వప్న వంట చేస్తోంది. అదే సమయంలో రాహుల్ స్టౌవ్ పక్కనే కూర్చుని భోజనం చేస్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తు అతడికి పైన ఉన్న డీజిల్ క్యాన్ పడింది. డీజిల్ మీద పడిన వెంటనే స్టౌవ్ నుంచి నిప్పు రవ్వలు కూడా ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా రాహుల్‌ను చుట్టుముట్టాయి.

గొడవ తర్వాత.. భర్త గదిలోని ట్రంకు పెట్టెను తెరిచిన భార్య.. అందులో అతడు దాచిన వస్తువును చూసి.. చివరకు..

గమనించిన భార్య మంటలను ఆర్పేసేందుకు ప్రయత్నించింది. అయినా సాధ్యం కాకపోవడంతో చివరికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు భర్తను గట్టిగా కౌగిలించుకుని.. తానూ మంటల్లో కలిసిపోయింది. వీరి కేకలు విన్న స్థానికులు.. అక్కడికి చేరుకుని మంటలను అతికష్టం మీద మంటలను ఆర్పేశారు. అనంతరం చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాహుల్‌కు సుమారు 80శాతం, స్వప్నకు 60శాతం కాలినగాయాలైనట్లు వైద్యులు తెలిపారు. రాహుల్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

సహోద్యోగితో యువకుడి ప్రేమాయణం.. అసలు విషయం తెలుసుకున్న యువతి.. ఓ రోజు మూడో అంతస్తులో..

మరోవైపు ఇదే జిల్లా పరిధి రత్ కొత్వాలిలోని ధనౌరి గ్రామంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కుటుంబ సమస్యల (Family problems) కారణంగా గ్రామానికి చెందిన సోనమ్(27) అనే మహిళ సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్త విన్న సోను అనే వ్యక్తి కూడా విష గులికలు తిన్నాడు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉంది. వీరికి సమీర్, సుమిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

ఆ విషయంలో భర్తను కట్టడి చేసేందుకు ప్రియుడితో కలిసి జ్యోతిష్యుడిని సంప్రదించిన భార్య.. ఇంట్లో అల్మారా చెక్ చేసిన భర్త.. చివరకు..

Updated Date - 2022-11-15T17:41:11+05:30 IST