ప్రియుడితో కలిసి భర్త ప్రాణం తీసింది.. నాలుగు సంవత్సరాల తర్వాత గుట్టు బైటపడింది..

ABN , First Publish Date - 2022-11-14T19:34:35+05:30 IST

వివాహేతర సంబంధం వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. పరాయి వ్యక్తిపై మనసుపడిన భార్య.. చివరకు అతడితో కలిసి దారుణానికి తెగబడింది. భర్త అడ్డు లేకుండా ప్రియుడితో ఆనందంగా గడపొచ్చని అనుకుంది. చివరకు ఏ భార్య చేయని విధంగా..

ప్రియుడితో కలిసి భర్త ప్రాణం తీసింది.. నాలుగు సంవత్సరాల తర్వాత గుట్టు బైటపడింది..

వివాహేతర సంబంధం వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. పరాయి వ్యక్తిపై మనసుపడిన భార్య.. చివరకు అతడితో కలిసి దారుణానికి తెగబడింది. భర్త అడ్డు లేకుండా ప్రియుడితో ఆనందంగా గడపొచ్చని అనుకుంది. చివరకు ఏ భార్య చేయని విధంగా అత్యంత దారుణంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి భర్తను చంపి పాతరేసింది. ఇన్నాళ్లూ తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ బుకాయించింది. అయితే నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు వారి గుట్టు బయటపడింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సహోద్యోగితో యువకుడి ప్రేమాయణం.. అసలు విషయం తెలుసుకున్న యువతి.. ఓ రోజు మూడో అంతస్తులో..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్ర వీర్, సవిత దంపతులు (couple) స్థానికంగా నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం సవితకు అరుణ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. భర్తకు తెలీకుండా అతడితో రాసలీలలు సాగించేది. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు (quarrels) జరుగుతుండేవి. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. 2018లో అరుణ్, సవిత కలిసి.. చంద్రవీర్‌ను తుపాకీతో కాల్చి హత్య చేశారు.

దొంగతనానికి వచ్చిన దొంగలు.. డబ్బులు తక్కువ అవడంతో దంపతుల దుస్తుల్లో వెతికి.. చివరకు భర్త ముందే..

అనంతరం కేసు తమ మీదకు రాకుండా ఉండేందుకు.. చంద్ర వీర్ మృతదేహాన్ని అరుణ్ ఇంట్లో ఏడు అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారు. తర్వాత పైన సిమెంట్ ప్లోరింగ్ వేశారు. అనంతరం తన భర్తను బంధువులు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసులో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే తాజాగా లభించిన కొన్ని ఆధారాల ద్వారా లోతుగా దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు అరుణ్, సవితను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని జైలుకు తరలించారు. ఈ ఘటన స్థానింగా తీవ్ర సంచలనం సృష్టించింది.

గొడవ తర్వాత.. భర్త గదిలోని ట్రంకు పెట్టెను తెరిచిన భార్య.. అందులో అతడు దాచిన వస్తువును చూసి.. చివరకు..

Updated Date - 2022-11-14T19:34:41+05:30 IST