మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

ABN , First Publish Date - 2022-12-23T15:56:33+05:30 IST

వారికి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఏడాదిన్నర కూతురు కూడా ఉంది. సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య ఇటీవల సమస్యలు తలెత్తాయి. చిన్న చిన్న విషయాలను కూడా..

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

వారికి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఏడాదిన్నర కూతురు కూడా ఉంది. సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య ఇటీవల సమస్యలు తలెత్తాయి. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య వద్దకు వెళ్లిన భర్త.. అంతా చూస్తుండగా దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

సినిమా స్టోరీని తలపించిన.. యువతి కిడ్నాప్‌ డ్రామా.. బర్త్‌ డే వేడుకలకు వెళ్లి ఆమె చేసిన పని..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బిలాస్పూర్ పరిధి అశోక్ నగర్ మురుం గనిలోని అటల్ ఆవాస్ ప్రాంతానికి చెందిన పూజా సాహు (20)కి అశోక్ నగర్‌కు చెందిన జితేంద్ర సాహుతో మూడేళ్ల క్రితం (love marriage) ప్రేమ వివాహమైంది. వీరికి ప్రస్తుతం ఏడాదిన్నర కూతురు కూడా ఉంది. మొన్నటిదాకా దంపతుల మధ్య ఎలాంటి గొడవలూ (quarrels) జరగలేదు. అయితే ఇటీవల దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలపై కూడా భార్యను వేధించేవాడు. అయినా పూజ మాత్రం ఎవరికీ చెప్పకుండా భరిస్తూ వచ్చింది. ఇటీవల వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. ఎందుకిలా చేస్తున్నారని భర్తను నిలదీయగా.. మరింత రెచ్చిపోయి చితకబాదేవాడు.

women-crime.jpg

Viral Video: ఇదెక్కడి ఘోరం.. హోటళ్లో కూర్చుని ఉన్నా వదలని మృత్యువు.. ఎలా దూసుకొచ్చిందో చూడండి..

దీంతో మూడు నెలల క్రితం పూజ తన పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం ఉదయం పూజ తన తల్లి సంతోషి గుప్తాతో పాటూ కూలి పనుల నిమిత్తం బయటి ప్రాంతానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పూజ భర్త.. వెనుక నుంచీ వెళ్లి ఉన్నట్టుండి భార్యపై దాడికి దిగాడు. తర్వాత పూజ, తన తల్లిపై ఇనుప రాడ్డుతో కొట్టాడు. దీంతో వారు స్పృహ తప్పి పడిపోయారు. చనిపోయారని భావించిన జితేంద్ర.. అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఘటనపై ఆలస్యంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కండక్టర్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ భార్య.. ఇటీవల 200కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భర్త.. భార్య బస్సు ఎక్కి..

Updated Date - 2022-12-23T15:58:05+05:30 IST