కండక్టర్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ భార్య.. ఇటీవల 200కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భర్త.. భార్య బస్సు ఎక్కి..

ABN , First Publish Date - 2022-12-21T19:44:45+05:30 IST

భర్త కానిస్టేబుల్‌గా పని చేస్తుంటే.. భార్య బస్సు కండక్టర్‌గా పని చేస్తోంది. విధుల్లో భాగంగా భర్త.. భార్యకు దూరంగా ఉంటున్నాడు. అయినా రోజూ ఫోన్లలో మాట్లాడుతూ భార్య యోగక్షేమాలు తెలుసుకునేవాడు. అయితే ఈ క్రమంలో..

కండక్టర్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ భార్య.. ఇటీవల 200కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భర్త.. భార్య బస్సు ఎక్కి..

భర్త కానిస్టేబుల్‌గా పని చేస్తుంటే.. భార్య బస్సు కండక్టర్‌గా పని చేస్తోంది. విధుల్లో భాగంగా భర్త.. భార్యకు దూరంగా ఉంటున్నాడు. అయినా రోజూ ఫోన్లలో మాట్లాడుతూ భార్య యోగక్షేమాలు తెలుసుకునేవాడు. అయితే ఈ క్రమంలో ఇటీవల భర్త ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. భార్యపై అనుమానం పెంచుకుని రోజూ వేధించేవాడు. ఇటీవల 200కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి.. భార్య పని చేస్తున్న బస్సు ఎక్కాడు. చివరకు అతడు చేసిన దారుణం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

Helicopter Car: రోడ్ల మీద హెలీకాఫ్టర్ తిరుగుతోందేంటని అవాక్కవుతున్నారా..? ఇది కారే..!

గుజరాత్‌లోని (Gujarat) ఛోటా ఉదయ్‌పూర్ పరిధికి చెందిన అమృత్ అనే వ్యక్తికి మంగూబెన్ అనే భార్య ఉంది. అమృత్ సూరత్‌లో కానిస్టేబుల్‌గా (Constable) పని చేస్తుంటాడు. ఇతడి భార్య మంగూబెన్.. ఛోటా ఉదయ్‌పూర్‌లో ప్రభుత్వ బస్సు కండక్టర్‪‌గా (Bus conductor) పని చేస్తోంది. ఇన్నాళ్లూ దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే భార్యకు దూరంగా ఉన్న అమృత్‌కు.. ఇటీవల అనుమానం పుట్టుకొచ్చింది. తన భార్య ఎవరితోనే వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఫోన్లలో మాట్లాడుకునే క్రమంలో ఇదే విషయంపై పదే పదే వాగ్వాదం పెట్టుకునేవాడు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని భార్య చెబుతున్నా.. అమృత్ మాత్రం రోజూ ఇదే ఆలోచనలో ఉండేవాడు. ఈ విషయంలో ఇటీవల వీరి మధ్య గొడవలు (quarrels) తారాస్థాయికి చేరాయి.

crime-news.jpg

రాత్రి వేళ భర్త ప్రియురాలి ఇంటికి.. పరాయి వ్యక్తితో కలిసి వెళ్లిన భార్య.. ఊహించని విధంగా..

దీంతో ఎలాగైనా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఓ రోజు అమృత్.. భార్యకు చెప్పకుండా 200 కిలోమీటర్ల దూరం నుంచి ఛోటా ఉదయ్‌పూర్ వచ్చాడు. భిఖాపూర్ అనే ప్రాంతంలో రోడ్డుపై నిలబడి భార్య కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఇంతలో అటుగా ఆమె పని చేస్తున్న బస్సు వచ్చింది. కండక్టర్ సీటులో కూర్చున్న తన భార్య వద్దకు వెళ్లీవెళ్లగానే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా శరీరంపై పలుమార్లు కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత అలాగే మృతదేహం పక్కన కూర్చుని ఉన్నాడు. ఊహించని ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు నుంచి కిందకు పరుగులు తీసి, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

Gujarat-Crime.jpg

భర్తను చంపి.. మృతదేహం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భార్య.. నాన్నను లేపొద్దంటూ పిల్లలకు చెప్పి..

Updated Date - 2022-12-21T19:44:51+05:30 IST