పరాయి వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పిన భార్య.. ఫోన్‌లో అసభ్యకర ఫొటోలు చూసిన భర్త.. ఎవరికీ చెప్పకుండా..

ABN , First Publish Date - 2022-12-25T20:32:39+05:30 IST

ఆ దంపతులు ఎలాంటి కలహాలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే సంతోషంగా సాగుతున్న వారి కాపురం.. ఓ ప్రబుద్దుడి కారణంగా చిన్నాభిన్నమైంది. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన వివాహితను ఓ వ్యక్తి..

పరాయి వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పిన భార్య.. ఫోన్‌లో అసభ్యకర ఫొటోలు చూసిన భర్త.. ఎవరికీ చెప్పకుండా..
ప్రతీకాత్మక చిత్రం

ఆ దంపతులు ఎలాంటి కలహాలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే సంతోషంగా సాగుతున్న వారి కాపురం.. ఓ ప్రబుద్దుడి కారణంగా చిన్నాభిన్నమైంది. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన వివాహితను ఓ వ్యక్తి అనుసరిస్తూ వెళ్లాడు. చివరకు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన ఆమె.. పరాయి వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని భర్తకు చెప్పింది. అంతలో అతడి ఫోన్‌కు నగ్నంగా ఉన్న భార్య ఫొటోలు వచ్చాయి. అవి చూడగానే.. చివరకు ఎవరికీ చెప్పకుండా అతడు చేసిన పని.. తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

Viral Video: పెళ్లిలో బంధువులంతా డ్యాన్స్ చేస్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన.. అంతా చూస్తుండగానే..

రాజస్థాన్ (Rajasthan) బార్మర్‌లోని బలోత్రా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వివాహిత డిసెంబర్ 16న వైద్య పరీక్షల నిమిత్తం బలోత్రా ఆస్పత్రికి వచ్చింది. అయితే అదే సమయంలో ఇక్కడి ప్రాంతానికి చెందిన గఫార్ ఖాన్ అనే వ్యక్తి.. ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు. మధ్యలో ఆమెను కత్తితో బెదిరించి (threatening) ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా దుస్తులు లేకుండా ఉన్న ఆమెను ఫోటోలు తీశాడు. బయట ఎవరికైనా చెబితే ఫొటోలు వైరల్ చేయడంతో పాటూ అందరినీ చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయాందోళనకు గురైంది. బాధపడుతూ ఇంటికి వచ్చిన ఆమెను.. ఏమైందంటూ, భర్త ప్రశ్నించాడు.

attack-on-women.jpg

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

చివరకు జరిగిన విషయాన్ని అతడికి తెలియజేసింది. దీంతో అతడు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అంతలో నిందితుడు.. బాధితురాలి భర్త ఫోన్‌కు నగ్నంగా ఉన్న భార్య ఫొటోలను (Indecent photos) పంపించాడు. విషయం ఎవరికైనా చెబితే ఫొటోలను సోషల్ మీడియాలో (Social media) షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలీక చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. రోజంతా అదే భయంతో ఉన్న అతను.. రాత్రి గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్యను విచారించగా.. జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

హనీమూన్‌ నుంచి రాగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భార్య.. భర్త తప్పు చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో.. చివరకు..

Updated Date - 2022-12-25T20:46:37+05:30 IST