Share News

AIMIM: ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం.. పూజారి ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్..

ABN , Publish Date - May 04 , 2024 | 02:34 PM

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

AIMIM: ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం.. పూజారి ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్..

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ప్రచారంలో భాగంగా ఆయన మే 4న మూసారాంబాగ్‌లో కలియతిరిగారు. స్థానికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతుండగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఆయన తన పర్యటనలో భాగంగా ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచి వెళ్తున్నారు.


అప్పటికే గుమిగూడిన ఎంఎంఐ కార్యకర్తలు అసద్‌ని ఆశీర్వదించాలని ఆంజనేయ స్వామి ఆలయ పూజారిని కోరారు. అసద్ కూడా అర్చకుడి ఆశీర్వాదం కోసం ముందుకు వచ్చారు.

అనంతరం పూజారి.. అసద్ మెడలో పూలమాల వేసి, శాలువా కప్పి సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం అసద్ అర్చకులందరితో కలిసి ఫొటో దిగారు. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. మత సామరస్యాన్ని చాటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

Lok Sabha Polls: క్షీణించిన తేజస్వి యాదవ్‌ ఆరోగ్యం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..!

Phone Tapping Case: ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావే... తేల్చేసిన పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 05:31 PM