Share News

AP Elections 2024:ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతారు: సుజనా చౌదరి

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:21 PM

వైసీపీ (YSRCP) ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Chowdhury) అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం నాడు పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

 AP Elections 2024:ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతారు: సుజనా చౌదరి

విజయవాడ: వైసీపీ (YSRCP) ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ (BJP) అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Chowdhury) అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం నాడు పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పాల్గొన్నారు.


Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ... కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని మాటిచ్చారు. ఐరన్ యార్డ్, కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నానని అన్నారు.


AP Elections: నీ అభిమానానికి ఫిదా.. చంద్రబాబు కోసం ఈయన ఏం చేశాడంటే..

పశ్చిమ నియోజకవర్గ ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.


AP Elections 2024: ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు.. రండి ఇలా చెక్ చేసుకోండి!!

సుజనా చౌదరిని గెలిపించుకోవాలి: జలీల్ ఖాన్

రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం సేవలందించిన సుజనా చౌదరి లాంటి నేతను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతారని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. సుజనా చౌదరికి అందరూ అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి సుజనా చౌదరిను గెలిపించుకోవాలని జలీల్ ఖాన్ కోరారు.


AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 28 , 2024 | 10:23 PM