Home » Andhra Pradesh » Elections
పీలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు (Chittoor) జిల్లాలో మరోసారి అరాచకాలు, అలజడులు సృష్టించడానికి వైసీపీ ప్లాన్ చేసింది. జిల్లాలో మరోసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. అధికార పార్టీకి బలంగా ఉన్న ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్తో జగన్ ప్రభుత్వం భూములు దోచుకునేందుకు కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు. మన భూములు మనకు దక్కకుండా సీఎం జగన్ (CM Jagan) చేస్తారని విరుచుకుపడ్డారు.
తాము ప్రచారం చేసే సమయంలో వైసీపీ (YSRCP) నేతలు తమకు అడ్డుతగిలి అరాచకాలు సృష్టిస్తున్నారని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు (Arani Srinivasulu) అన్నారు. తమ ప్రచారం సందర్భంగా గిరిపురంలో తమపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోక పోవటం, వైసీపీ వారం రోజులుగా తమ ప్రచారంలో అరాచకాలు సృష్టించటంపై తిరుపతి ఎస్పీకి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.
Andhrapradesh: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి కల్పించాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థికి 1+1 భద్రత కేటాయించాలని న్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది. తనకు భద్రత కల్పించాలంటూ ఎస్పీకి పులివర్తి నాని విజ్ఞప్తి చేశారు. అయితే ఎస్పీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు (సోమవారం) టీడీపీ అభ్యర్థి పిటిషన్పై విచారణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ( AP Elections 2024)ల్లో కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల స్వీకరణ గడువు ఏప్రిల్ 25వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. పోలింగ్కు ముందే కొందరు నేతలు, కార్యకర్తలు భవిష్యత్ కార్యాచారణ ప్రకటిస్తూ పార్టీలు మారిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది..
ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిసినా.. తాము గత ఐదేళ్లుగా అమలు చేసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలే ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ నాయకులు లెక్కలు వేస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభివృద్ధిని పక్కనపెట్టి.. ఓట్ల కోసమే అన్నట్లు రాష్ట్రం లోటుబడ్జెట్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ అప్పులమయమైంది.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని.. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా హామీలు 99 శాతం పూర్తి చేశామని అంటున్నారని.. నిజంగా 99 హామీలు పూర్తి చేశారా అంటూ మాజీ ఎంపీ సూటిగా ప్రశ్నించారు.
ఏపీలో రాజకీయ పార్టీలు యువత జపం చేస్తున్నాయి. ఇప్పటికే పేద, మధ్యతరగతికి చెందిన వృద్ధులు, మహిళల్లో ఎక్కువమంది ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయిపోయారు. మరోవైపు ఉద్యోగులు, వేతన జీవులు సైతం ఓటు ఎవరికి వేయాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో యువత ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. మొదటిసారి ఓటు వేయనున్న వారి సంఖ్య దాదాపు 10.3 లక్షలు కావడంతో.. వీరి ఓట్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి.