LeftMenu
Mutyalamuggu at andhrajyothy.com

హైదరాబాద్, మే 16 : వందల కోట్లకు అధిపతి.. జాతీయ స్థాయిలో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ చంచల్‌గూడ జైలులో... ఖైదీల మధ్య ఒకరుగా మారిపోయారు! ఒకప్పుడు వాన్‌పిక్ భూసంతర్పణలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐఆర్‌టీఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డిదీ అదే పరిస్థితి!

న్యూఢిల్లీ, మే 16: ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ అధిష్ఠానం ఉప ఎన్నికలపై మరింత దృష్టి కేంద్రీక రిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా పాల్గొనాలంటూ.. పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో తనను కలిసిన చిరంజీవి, వి.హనుమంతరావు, రాయపాటి సాంబశివరావులను సోనియాగాంధీ ఆదేశించారు.

హైదరాబాద్, మే 16 : పరకాల ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థిగా మొలుగూరి భిక్షపతి పేరును ఖరారు చేసినట్లు పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. టికెట్‌కోసం ఏడెనిమిది మంది పోటీపడిన నేపథ్యంలో నాయకుల ఏకాభిప్రాయం మేర కు భిక్షపతి పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఆమోదించారని తెలిపారు.

హైదరాబాద్, మే 16: పోలవరం ప్రాజెక్టుపై ఆర్థిక, నీటిపారుదల శాఖల వైరం తారస్థాయికి చేరింది. తన మాటనే నెగ్గించుకోవాలని ఆర్థిక శాఖ పట్టుదలగా ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక శాఖ ఆదేశాలను పాటించరాదని నీటి పారుదల శాఖ భీష్మించుకుని కూర్చుంది.

16-5navyawkly