న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : కోట్ల లెక్క తేలింది. ఆ కోట్లు మోసుకెళ్లిన కొరియర్ ఎవరో తెలిసింది. ఇక తేలాల్సిందల్లా... ఆ సొమ్ములు ఎక్కడికి చేరాయన్నదే! ఆ కొరియర్ సునీల్ రెడ్డి. ఆయన మోసుకెళ్లిన సొమ్ము రూ.96 కోట్లు. వసూలు చేసింది కోనేరు రాజేంద్రప్రసాద్, స్టైలిష్ రంగారావుల ద్వారా! మరి... ఆ సొమ్ము చేరిందెవరికి? ఎమ్మార్ కుంభకోణంలో ఇదో కీలకమైన ప్రశ్న! ఈ మిస్టరీ ఛేదించేందుకు సీబీఐ కసరత్తు చేస్తోంది.