హైదరాబాద్, జనవరి 29: ఓఎంసీ ఫైళ్ళు రొటీన్లో భాగంగానే వచ్చాయని, రొటీన్గానే సంతకం పెట్టానని అప్పటి గనుల శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెబుతుండడంపట్ల తెలుగుదేశం పార్టీ మండిపడింది. రొటీన్గానే సంతకం చేసినట్లు చెప్పడం ఆమె బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతి కూడా రొటీన్గానే జరిగినట్లుగా మంత్రి వ్యాఖ్యలు చెబుతున్నాయని పేర్కొంది.