LeftMenu
Mutyalamuggu at andhrajyothy.com

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : కోట్ల లెక్క తేలింది. ఆ కోట్లు మోసుకెళ్లిన కొరియర్ ఎవరో తెలిసింది. ఇక తేలాల్సిందల్లా... ఆ సొమ్ములు ఎక్కడికి చేరాయన్నదే! ఆ కొరియర్ సునీల్ రెడ్డి. ఆయన మోసుకెళ్లిన సొమ్ము రూ.96 కోట్లు. వసూలు చేసింది కోనేరు రాజేంద్రప్రసాద్, స్టైలిష్ రంగారావుల ద్వారా! మరి... ఆ సొమ్ము చేరిందెవరికి? ఎమ్మార్ కుంభకోణంలో ఇదో కీలకమైన ప్రశ్న! ఈ మిస్టరీ ఛేదించేందుకు సీబీఐ కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్, ఫిబ్రవరి 11 : రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా, ప్రయోగాత్మకంగా కాగితం రహిత (పేపర్ లెస్) బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో.. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మీడియాకు.. బడ్జెట్‌ను పుస్తకాల రూపంలో బదులుగా అరచేతిలో ఇమిడే సీడీల రూపంలో సర్కారు ఇవ్వబోతోంది.

హైదరాబాద్, ఫిబ్రవరి 11 : 'కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కు పోయింది. అన్ని వ్యవస్థలు కుళ్లి కంపుకొడుతున్నాయి. జరిగింది చాలు. చైతన్య స్ఫూర్తితో కదలండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకొందాం...రండి' అని యువతకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 11 : కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణపై చిత్తశుద్ధి, విశ్వాసం లేవని.. అందుకే అవి మోసం చేస్తూ వస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. చిన్న రాష్ట్రా లు ఏర్పడితే అభివృద్ధి కుంటుపడుతుందనడం అసత్యమని గర్జించారు.

12-2ajsundayindex