Share News

BJP: కాంగ్రెస్‌ను దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరు: బండి సంజయ్

ABN , Publish Date - Apr 27 , 2024 | 08:17 AM

కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) విమర్శించారు. సంజయ్ శనివారం ఉదయాన్నే కరీంనగర్ లోని ఓ కాలేజీ గ్రౌండ్‌లో మార్నింగ్ వాక్ కి వెళ్లారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.

BJP: కాంగ్రెస్‌ను దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరు: బండి సంజయ్

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) విమర్శించారు. సంజయ్ శనివారం ఉదయాన్నే కరీంనగర్ లోని ఓ కాలేజీ గ్రౌండ్‌లో మార్నింగ్ వాక్ కి వెళ్లారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.


ఆయన మాట్లాడుతూ.. "దేశాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థి కాంగ్రెస్ లో ఉన్నారా. కాంగ్రెస్ ను దేశం నమ్మడం లేదు. కనీసం పీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కడి వారో తెలియదు. అలాంటి వారికి ఓటెలా వేస్తారు. కొండగట్టుకు, వేములవాడకు నిధులు ఇస్తాం అంటే మాజీ సీఎం కేసీఆర్ సహకరించలేదు. కేసీఆర్‌కు వినోద్ ఎందుకు లేఖ రాయలేదు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మూడో స్థానమే. కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు. ఎన్నికలు ఉన్నప్పుడే కేసీఆర్ అలారం పెట్టుకుని నిద్ర లేస్తారు" అని సంజయ్ అన్నారు.

KCR: ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీసే కుట్ర

Updated Date - Apr 27 , 2024 | 08:17 AM