Home » KCR
ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని, సర్కారు చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధాన్యానికి రూ.500బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు సన్న రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సన్న రకం ధాన్యాన్ని 10శాతం మాత్రమే పండిస్తారని, 90శాతం ఇతర రకాల ధాన్యం వస్తుందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పంద్రాగస్టులోగా
తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనానికి వెళ్లే మొట్టమొదటి దారిలో ఉన్న వినాయకుడి గుడి వద్ద మంగళవారం విఘ్నేశ్వరుని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఆ ఆలయ అర్చక పండితునికి తన ప్రత్యేక పవిత్ర మహాగ్రన్ధమ్ ‘నేనున్నాను’ అందించి మంగళాశీర్వచనం పొందారు. అనంతరం తిరుమల గోశాలనీ దర్శించుకుని... అక్కడి సిబ్బందితో గోవులతో ఉంటే ఉండే ఆరోగ్యం, ఆనందం గురించి మాట్లాడి ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తదుపరి శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన శ్రీ రంగనాథమంటపంలో వేదపండితుల ప్రత్యేక ఆశీర్వచనం, శేషవస్త్రం పొందారు.
ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. మూడు పార్టీలూ ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, గత నవంబరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. సోమవారం సొంత గ్రామంలో ఓటేసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని పునరుద్ఘాటించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశారెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్(BRS) నేతలు ఉన్నారు.
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాద్లోని నందినగర్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు పేర్కొన్నారు.
Telangana: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు అయ్యింది. ఈరోజు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ను పరామర్శించేందుకు కేసీఆర్ దేవరకొండకు వెళ్లాల్సి ఉంది. రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు.
ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలో రానుందని.. తాను కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నానని జాతీయ పార్టీ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు! రాష్ట్రంలో రాజకీయంగా బతికి బట్టకట్టడమే పెను సవాల్గా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటున్నారు. ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిందేనని.. ఈమేరకు తాను ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.