Home » YuvaGalam
యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు. చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు కృతజ్ఞతాభినందనలు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ( TDP ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సోమవారం నాడు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ( Visakha Steel ) ప్రైవేటీకరణను అంగీకరించబోమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) స్పష్టం చేశారు. సోమవారం నాడు నారా లోకేష్ను విశాఖ ఉక్కు నిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... ‘‘భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించింది’’ అని నారా లోకేష్ తెలిపారు.
అమరావతి: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది.
గన్మోహన్రెడ్డి ( JAGAN ) పాలనలో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పేర్కొన్నారు.
యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) పేర్కొన్నారు. ఆదివారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ ఎన్నికల శంఖారావం సభా వేదిక పరిశీలించారు.
జగన్ అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు.
లుగుదేశం పార్టీ ( Telugu Desam Party ) అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 229 అమలు చేస్తామని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పేర్కొన్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) శనివారం నాడు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అనకాపల్లిలో లోకేష్కి టీడీపీ ఇన్చార్జి పీలా గోవింద్ , జనసేన ఇన్చార్జి పర్చూరి భాస్కర్రావు నారా లోకేష్కి స్వాగతం పలికారు.
ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) రావడం లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) స్పష్టం చేశారు.