Home » YCP
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ దాడులను హోంమంత్రి అనిత, ఎంపీలు కేశినేని శివనాథ్, కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు. డైవర్షన్ కోసమే ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులకు పాల్పడిందని నేతలు ఆరోపించారు.
వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. మంగళవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులకు యత్నించాయి. ముందస్తుగానే పక్కా ప్రణాళికతో..
హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ హంగామా సృష్టించింది.
ఆదోనిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, అందరినీ సంప్రందించి అమరావతిని నిర్ణయించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతికి జగన్ కూడా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.
దేశంలో గల 11 పార్టీల సభ్యులు లోక్సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైసీపీ మాత్రం అమరావతిని వ్యతిరేకించి.. సమయం ఇవ్వలేదని కొత్త పల్లవిని పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ.. స్థిరమైన విధానం కానీ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గురువారం రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఉభయసభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యసభలోనూ అమరావతిపై వైసీపీ విషం కక్కింది. రాజధానికి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదంటూ విమర్శించింది.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అనేక అంశాలపై బిల్లులో క్లారిటీ లేదని ఆయన అన్నారు.