Home » Warangal News
రాష్ట్రంలో యూరియా కొరత సమస్య కొనసాగుతోంది. అక్కడక్కడా సరఫరా జరుగుతున్నా.. సరిపడా నిల్వలు అందుబాటులో లేక రైతుల అవసరం తీరడం లేదు. వరంగల్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు.
కడియం శ్రీహరికి ఘన్పూర్ అభివృద్ది ఇప్పుడు గుర్తొచ్చిందా అని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్పా.. ఘన్పూర్ అభివృద్ధితో పనిలేదని విమర్శించారు. ఘన్పూర్లో కడియం మార్క్ ఎక్కడా కనిపించదని తాటికొండ రాజయ్య ఆరోపించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.
రాణీ రుద్రమ సైన్యం యుద్ధ తంత్రాలకు వేదిక... కాకతీయుల కోట వరకు రహస్య సొరంగాలున్న నేల... ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు నెలవైన ప్రాంతం... వరంగల్ నగరానికి కూతవేటు దూరంలో... గీసుకొండ మండలం మొగిలిచర్లలో కాకతీయుల కాలంలో నిర్మిం చిన ‘ఏకవీర’ ఆలయం ఉంది.
తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఆంధ్రా కోవర్టుగా మారి, ఆంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు బనకచర్లకు ఓకే చెప్పారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆరోపించారు.
పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్రెడ్డి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్ముతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.
మాజీ మంత్రి కేటీఆర్కు జైలు జీవితం తప్పదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్కు ఇచ్చిన హామీలను మరిచిన దొంగ కేటీఆర్ అని విమర్శించారు.
రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని.. లేదంటే సీఎం రేవంత్రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు.
Sim Cards Misuse: గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సిమ్ కార్డులను తమ వ్యక్తిగతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో విద్యార్థి సంఘాల నేతలను వరంగల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.