Home » Visakhapatnam
కైలాసగిరిపై ఢమరుకంతో కూడిన భారీ త్రిశూలం ప్రాజెక్ట్ ప్రారంభమైంది. విశాఖ నగరంలో ఎక్కడ నుంచి కైలాసగిరి వైపు చూసిన కనిపించేలా 65 అడుగుల ఎత్తులో త్రిశూలంను ఏర్పాటు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రైల్వేజోన్ అంశాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదని ప్రశ్నించారు.
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’ నిర్వహించారు. గురువారం ఉదయం విశాఖ బీచ్ రోడ్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి భారీ సంఖ్యలో కార్లు, బైక్లతో ర్యాలీని ప్రారంభించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
కైలాసగిరిపై నిర్మించిన త్రిశూలం, ఢమరుకాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తామని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ మంగళవారం ప్రకటించారు. వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్, సీఈ వినయకుమార్, ఇతర అధికారులతో కలిసి కైలాసగిరిని సందర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెంచాలన్న సర్కారు లక్ష్యానికి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. తమ వద్ద చదువుతూ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి సిద్ధమైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.
విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ గెజిట్ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వేను అధికారికంగా ప్రారంభించనుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై బాలిక మృతిచెందింది.
వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని వెల్లడించారు.
మండలంలోని ఆనందపురంలో కిమిడి రాజేశ్వరి (26) అనే వివాహిత శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది.