Home » Visakhapatnam
బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
జీవీఎంసీ, వీఎంఆర్డీఏలు.. ఇతర విభాగాలతో కలిసి విశాఖ ప్రాంతాన్ని అత్యంత క్రియాశీలకంగా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. అభివృద్ధి ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైంది.. స్వర్ణాంధ్ర విజన్ 2047, వికసిత్ భారత్ లక్ష్యాలలో విశాఖ కీలకం..
ప్రజల నివాసానికి, జీవన వికాసానికి అత్యంత ప్రముఖమైన నగరంగా సాగరనగరం విశాఖను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముంబై, వారణాసి, సూరత్, విశాఖల అభివృద్ధికి కేంద్రం సరికొత్త విజన్ తెచ్చిందని..
ఏపీలో రూ.82 వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో రీన్యూ పవర్ సంస్థ ఎంవోయూలు కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది.
విశాఖపట్నం సీఐఐ పార్టనర్ షిప్ కంటే ముందే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలియజేశారు.
భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రతీ వీఐపీ బాధ్యత తమదే అని పేర్కొన్నారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రమిస్తున్నారన్నారు.