Home » Vijayawada
Vijayawada Bomb Scare: విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్టు కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీసెంట్ రోడ్డులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
త్వరలో ప్రారంభించనున్న విజయవాడ - బెంగుళూరు మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.
Liquor Case Remand: ఏపీ లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.
AP Heavy Rains: విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన విజయవాడ వాసులకు మారిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు.
పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్ అమలుపై ఆర్టీసీ కీలక మార్గదర్శకాలు విడుదల చేశాయి. పదోన్నతి లేనిపక్షంలో 6 సంవత్సరాల సేవ తర్వాత ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
Summer Trips From Hyderabad: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి, మనసును రీఛార్జ్ చేసుకునేందుకు వేసవి సెలవులను మించిన అద్భుత సమయం లేదు. మీరూ ఈ సమయంలో ప్రశాంతత, ఆనందం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలను తప్పక సందర్శించండి.
తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కొత్త మార్గాలు, హైటెక్పద్ధతులతో జరుగుతోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి ఎస్కార్ట్ వాహనాలు, మొబైల్ యాప్ల సహాయంతో ఇసుక దొంగతనం కొనసాగుతోంది.
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్లో ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆయనకు మంచం, దిండు, భోజన అనుమతిపై జైలు అధికారుల నిర్ణయాన్ని పేర్కొంది.
సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదించింది. రూ.3500 కోట్ల దుర్వినియోగంపై విచారణ అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. కాంపిటెంట్ అథారిటీ అనుమతి అవసరం లేదని ఏడీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ, జైలులో సౌకర్యాలు కల్పించాలన్న నిందితుల విజ్ఞప్తికి అంగీకరించింది.
Amaravati: సీఎం చంద్రబాబు నివాసం సమీపంలోని తపోవనం వద్ద కరకట్ట రోడ్డు నుంచి ప్రమాదవశాత్తు కారు కింద పడింది. కారు ముఖ్యమంత్రి నివాసం సమీపంలో బోల్తాపడడం, ఎవ్వరికి పెద్దగా గాయలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తక్షణం కారులో ఉన్న ఇద్దరినీ అక్కడి నుండి తరలించారు.