Home » Videos
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జేసీబీ నడిపి.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ కార్యకర్తలంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు.
రెండు కేసుల్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు లాగడం అత్యాచారయత్నమేనని స్పష్టం చేసింది.
సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు.. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎల్ఈడీ లైట్ల వరకు.. రక్షణ రంగ పరికరాల నుంచి రాకేట్ ఇంజిన్ల వరకు.. ఏదీ తయారు చేయాలన్నా భూమి పొరల్లో లభించే అరుదైన లోహాలు చాలా ముఖ్యం.
ఏఐ ప్రపంచంలో రెండు భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం, సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా.. తన నివేదికలో ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అడుగు పెట్టిన టెక్ దిగ్గజం బిల్ గేట్స్.. ఏపీ సర్కార్ హైటెక్ పాలనను చూసి ఫిదా అయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి అమరావతి నిర్మాణం వరకు చంద్రబాబు విజన్ చూసి గేట్స్ మురిసిపోయారు.
కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక గురువు సద్దురు జగ్గీ వాసుదేవ్ భక్తులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.
రౌడీషీటర్ అంతిమయాత్రలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు హల్చల్ చేశాయి. విజయవాడలో రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం అంతిమ యాత్రలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు.
మహా శివరాత్రి సందర్భంగా ఫిల్మ్ నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రుద్రాభిషేకం, లింగార్చన నిర్వహించగా.. వారు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.