Home » Uttam Kumar Reddy Nalamada
గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవిధానానికి విరుద్ధమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదని తేల్చి చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మండిపడ్డారు.
కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లయి ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రాజకీయ, ఆర్థిక సమస్యలున్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి సమస్యలను పరిష్కరించుకుంటూ మందుకు సాగుతున్నామని చెప్పారు.
ఖరీఫ్, రబీ సీజన్లలో 285 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు.
తుమ్మడిహెట్టిని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ మెయిన్ గుండె అని బీఆర్ఎస్ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు మేడిగడ్డ గుండె పగిలిందని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగులా భారంగా మారిందనడం సరికాదని.. నిజానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లే తెలంగాణ పాలిట తెల్ల ఏనుగులని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు ఇస్తేనే వణికిపోతున్నారు.. కమిషన్ నివేదిక ఇచ్చాక ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు తప్పవు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోర తప్పిదాలు జరిగాయని రాజ్యాంగబద్ధంగా పని చేసే అన్ని సంస్థలు తప్పుబట్టాయి.
విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతిలో సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి.
తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా టన్నెల్ తవ్వకాలు, మరమ్మతులు చేపట్టాలని మరియు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సూచించారు,