Home » TTDP
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటికి దూరంగా ఉండాలని, ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
తెలుగుదేశం తెలంగాణ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు చంద్రబాబు.
ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి గతంలో అనుమతించని ఆర్టీసీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘాట్ రూట్లలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
తిరుమలలో శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు భక్తుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. ఈ రోజు దర్శనం టికెట్ల కోసం ముందు రోజు నుంచే భక్తులు క్యూ లైన్ల వద్ద వేచి ఉన్నారు. కరెంటు బుకింగ్ కింద కేవల 800 టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. ఆ టిక్కెట్లోన్నీ గంట వ్యవధిలోనే పూర్తవుతున్నాయి.
తిరుమల అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా కొనసాగిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టౌన్ప్లానింగ్ విభాగం ఏర్పాటు చేసి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు గురువారం రూ.2.45 కోట్లు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన జినేశ్వర్ ఇన్ఫ్రా వెంచర్స్ మరియు శ్రీలంక నుంచి వచ్చిన మరో దాత ఒక్కొక్కరికి రూ.కోటి విరాళం అందించారు
వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని భక్తుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేసిన ఇద్దరు దళారీలను తిరుమల టూటౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి. కలిసి మాట్లాడారు. మర్యాద పూర్వకంగా చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు.
రివర్స్ టెండరింగ్ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్వస్తి పలికింది. వైసీపీ హయాంలో అమలు చేసిన ఈ విధానం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ఈవో నిర్ణయం తీసుకున్నారు.
జగన్కు ఐదేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారో రాష్ట్రం యావత్ కళ్లారా చూసింది. పంచభూతాలను గుప్పిటపట్టి ప్రతిదీ ఓ వ్యాపార సరుకుగా మార్చేశారు. ఇసుక వ్యాపారమే ఇందుకు నిదర్శనం. జగనే ఇలా చేస్తే, ఆయన బాబాయి, ‘సూపర్స్వామి’ వైవీ సుబ్బారెడ్డి ఇంకెలా చేసి ఉంటారు? అబ్బాయిని ప్రసన్నం చేసుకుని తిరుమల పుణ్యక్షేత్రాన్ని ...