Home » TTD
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ముహూర్తం ఉండాలి. తాళి, తలంబ్రాలు ఉండాలి. మంగళమేళాలు హంగూ ఆర్భాటాలు తప్పనిసరి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం వీటిలో దేనికీ ప్రాధాన్యం లేదు. ఇవేవీ లేకుండానే పెళ్లి జరిగిపోతుంది.
తిరుమల శ్రీనివాసుడిని దర్శించు కోవడమే ఒక దివ్యానుభూతి. ఎక్కడెక్కడి నుంచో కష్టాలకోర్చి తిరుమలకు చేరుకుంటారు. గంటలకు గంటలు క్యూల్లో వేచివుండి అయినా స్వామి దర్శనం చేసుకుంటారు. వసతుల్లేవని విసుక్కోరు. క్షణకాలం ఆయన మూల మూర్తిని దర్శించుకోగానే పడ్డ శ్రమంతా మరచి పోతారు.
లోకకల్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి సాక్షాత్తు బ్రహ్మ దేవుడే ఉత్సవాలను నిర్వహించాడట. బ్రహ్మ స్వయంగా నిర్వహించిన ఉత్సవాలు కావటంతోనే ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు పొందాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ప్రపంచంలో 197 దేశాలుంటే 157 దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో లభించింది. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా చూస్తే రూ.201,65,97,829 విదేశీ కాయిన్స్, నోట్లు అందాయి.
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్అదాలత్లో రాజీ కుదిర్చిన కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అప్పటి అధికారులు, పాలకుల గుండెల్లో గుబులు మొదలైంది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ శోభాయమానంగా దర్శనమిస్తోంది.
గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపణలు చేశారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదని ధ్వజమెత్తారు.
వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీగా దోచుకున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి హుండీని వైసీపీలోని కీలక నేతలు దోచుకున్నారని విమర్శించారు.
బ్రహ్మోత్సవాలలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు, గదులు రద్దు చేశామని.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో వివరించారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులకు 1.16 లక్షల రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను భక్తులకు విక్రయించామని తెలిపారు.
టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచులపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం సాయంత్రం ఆయన తనిఖీలు చేపట్టారు.