Home » TTD
ఏపీలో కూటమి నేతృత్వంలో మంచి పాలన జరుగుతోందని మాధవ్ తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్కు అభినందనలు తెలిపారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి వారి గరుడ సేవను తిలకించడానికి ఇప్పటికే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మాడ వీధుల్లోని గ్యాలరీలు ఇప్పటికే దాదాపుగా నిండిపోయాయని చెప్పుకొచ్చారు.
భారతదేశంలో మొట్టమొదటి AI-పవర్డ్, భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో ప్రారంభమైంది. ఇది మొత్తం ఆలయ వ్యవస్థలో అద్భుతమైన రక్షణ, ముందు జాగ్రత్త చర్యల్ని సూచిస్తుంది.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దివ్యరూపం ఒక్కొక్కరికి ఒక్కోలా అనుభూతిని మిగుల్చుతుంది. శ్రీవారు దేవేరులతో కొలువైన ఆలయంలో ఉదయం నుంచి రాత్రి దాకా జరిగే సేవటు ఏంటి, ఏ సమయంలో ఏం చేస్తారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు వీడియో సందేశం ద్వారా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.
మహాలయ అమావాస్య నేపథ్యంలో తిరుపతి సమీపంలోని కపిల తీర్థానికి భక్తులు భారీగా పోటెత్తారు.
తిరుపతి శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనం గురించి తాము ఆధారాలతో సహా మాట్లాడుతున్నామని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు, భూమన కరుణాకర్ రెడ్డిలకి ముసళ్ల పండగ ముందుందని భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.
కలియుగ వైకుంఠంగా బ్రహ్మాండ పురాణం కీర్తించిన శేషాచలం ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగా కూడా అత్యంత ప్రాముఖ్యం గలది. ఈ పర్వత శ్రేణి ప్రాచీన అవశేషాల పుట్ట. కోట్ల ఏళ్ల కిందటి సహజ శిలాతోరణం మొదలుకుని, ఆదిమ మానవుల సంచారం దాకా... పల్లవుల నిర్మాణాల నుంచి విజయనగర రాజుల కట్టడాల దాకా శేషాచలం నిండా పురాతన అవశేషాలు పరుచుకుని కనిపిస్తాయి.
‘తీర్థాల సన్నిధి యందు స్నానం సేయగనే పుణ్యములు పొంగునయా’ అని తిరుమల కొండల్లోని పుణ్య తీర్థాల గురించి తాళ్లపాక అన్నమా చార్యులు ఓ కీర్తనలో చెబుతారు. శేషాచలం అంతా తీర్థాల మయం. ఈ కొండల్లో 66కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం, స్కంధ పురాణం వెల్లడిస్తాయి.
‘‘ఏడు కొండల సామి.. ఎక్కడున్నావయ్యా... ఎన్నీ మెట్లెక్కినా.. కానరావేమయ్యా.. ఈ అడవిదారిలో.. చేయూతనీయవా..’’ అంటూ శ్రీవేంకటేశ్వర మహత్యము సినిమాలోని పాట, తిరుమలకు చేరుకోవడం ఎంత కష్టమో వివరిస్తుంది. ఇప్పుడంటే ఎక్కడానికీ దిగడానికీ వేరువేరుగా సురక్షితమైన తారురోడ్లు ఉన్నాయి కానీ... ఒకప్పుడు దట్టమైన అడవిలో, క్రూరమృగాల నడుమ నుంచి, వాగులు వంకలు దాటి బండలు కొండలు ఎక్కి, లోయలు దాటి తిరుమలకు చేరుకోవాల్సి వచ్చేది.