Home » TSPSC
గ్రూప్-4 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈమేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎ్సపీఎస్సీ) వెబ్సైట్లో జాబితాను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేశారు. వీరికి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
తెలంగాణలో 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 రీ నోటిఫికేషన్కు నిరుద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గత నెల 19న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేశారు.
TSPSC Exam Dates : తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. టీఎస్పీఎస్సీ(TSPSC) కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ను(Exam Schedule) ఖరారు చేసింది టీఎస్పీఎస్సీ. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ను విడుదల..
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. రేవంత్ సర్కార్ గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది.
TSPSC Group 1 Notification 2024: ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ 1 ఎగ్జామ్(Group 1 Exam) రద్దవగా.. ఇప్పుడు ఆ నోటిఫికేషనే రద్దైంది. అంతేకాదు.. ఆ పాత నోటిఫికేషన్ను క్యాన్సిల్ చేసిన టీఎస్పీఎస్సీ కొన్ని పోస్టులను పెంచి మొత్తం 563 పోస్టులతో టీఎస్పీఎస్సీ(TSPSC) సరికొత్త నోటిఫికేషన్(Group 1 Notification) జారీ చేసింది.
TSPSC Group 1 Notification: తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ(TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్(Group 1 Notification) విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఈ పోస్టులకు దరఖాస్తులు(Group 1 Applications) ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
TSPSC Group 2 Notification: తెలంగాణ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను(Group 1 Notification) రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో మార్పుల కోసం ఒక మెమో తీసుకువచ్చిందని... ఫిబ్రవరి 10 వ తేదీన జీవో నంబర్ 3ను విడుదల చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3 తో మహిళలకు ఇస్తున్న 33.3 శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ పాయింట్లో రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు జీవోలో చెప్పిందని అన్నారు.
తన ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీఎస్పీఎస్సీ చైర్మన్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలపై మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1లో మరో 60 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.