Share News

Group 1: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:31 PM

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్‌-1లో మరో 60 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Group 1: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

హైదరాబాద్‌: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్‌-1లో మరో 60 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రూప్‌-1 పోస్టుల సంఖ్య 563కి చేరాయి.

2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. అయితే, ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా.. పేపర్ లీకేజ్ కారణంగా ఆ పరీక్ష రద్దైంది. దాంతో 2023 జూన్‌లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. దీనిపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కానీ, కోర్టులో ఇంత వరకు వాదనలు జరుగలేదు.

Updated Date - Feb 06 , 2024 | 04:31 PM