Home » TRS
తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1200 కోట్లు కప్పం కట్టించుకున్న సిగ్గు లేని ప్రభుత్వం ఇదంటూ రేవంత్ రెడ్డి సర్కార్పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ ‘టీఆర్ఎస్’ పేరుపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ పేరును కేటాయించవద్దంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా, తాజాగా మహారాష్ట్రకు చెందిన మరో సంస్థ కూడా అదే వాదన వినిపించింది.
జహీరాబాద్లో బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించారని.. కానీ డీపీఆర్లో బుల్లెట్ ట్రైన్ ఎందుకు లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.
సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్రెడ్డి సర్కార్ విఫలమైందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెంట్రింగ్ కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ‘TRS’ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బహిరంగ ప్రకటన వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ కలిసి ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ప్రధాని సభా వేదికను కేంద్ర మంత్రి పంచుకోకుంటే బాగుండేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రధాని పర్యటనలో బండి సంజయ్ పాల్గొనడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమం కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తామిచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలన్నారు.
పాంచజన్యం పేరుతో ఐదు ప్రాధాన్య అంశాలను తీసుకున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ఈ ఐదు అంశాలు ప్రధాన ఫోకస్గా ఉంటాయని చెప్పారు.