Home » Trains
ఓ వ్యక్తి రైల్లో జనరల్ బోగీలో లగేజీ పెట్టే స్థలంలో పడుకున్నాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా అతను పడుకున్న స్థలంలో చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు..
పేరులోనే ఎక్స్ప్రెస్ ఉంది కానీ ఇది గూడ్సు కన్నా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలుగా గుర్తింపు పొందింది. ఎంత నెమ్మదిగా వెళ్తుందంటే... మొత్తం 290 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. దీని సగటు వేగం గంటకు కేవలం 37 కిలోమీటర్లు మాత్రమే.
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సెప్టెంబరు 9 నుంచి నవంబరు 19 వరకూ బిలాస్ పూర్-యల్హంక (వయా గుంతకల్లు) మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఓ వ్యక్తి రైల్లో డోరు పక్కన కూర్చుని రీల్స్ చేస్తున్నాడు. రైలు వేగంగా వెళ్తున్నా కూడా డోరు వద్ద ప్రమాదకరంగా కూర్చుని వీడియోలు చేస్తున్నాడు. ఇంతలో సడన్గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
గుంటూరుకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ భవానీపురంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. మార్బుల్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లుగా వ్యవహరిస్తాడు. మార్బుల్ పనికి వెళ్లే రెహ్మాన్కు చేతివాటం బాగా ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్లపై నీరు నిలిచిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 36 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.
లంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. కామారెడ్డి జిల్లా బికనూరు తాళమండ్ల సెక్షన్లో భారీ వరద ప్రవాహంతో ట్రాక్ కింద నీరు నిలవడంతో వివిధ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది.
సికింద్రాబాద్ స్టేషన్లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను బుధవారం నుంచి నవంబర్ 26 వరకు మల్కాజ్గిరి, హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్కు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
కోవై జిల్లా ఆవారంపాళ్యంలో రైలును కూల్చివేయాలనే సంఘ విద్రోహులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వివరాల్లోకి వెళితే త్రివేడ్రం-చెన్నై ఎక్స్ప్రెస్ కోవై జిల్లాలోని ఆవారంపాళ్యం దాటిన సమయంలో పట్టాలపై సిమెంటు రాళ్లు పెట్టిన విషయం తెలిసింది.
దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు కొండపల్లి స్టేషన్లో హాల్ట్ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున హాల్ట్ తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.