Home » TPCC Chief
కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు..? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం అయిపోయినంత వరకూ నడిచిన.. ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయ్..! అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది.. ఇదిగో ఈయనే కన్ఫామ్ అయ్యారని లెక్కలేనన్ని వార్తలు.. అంతకుమించి పుకార్లు షికార్లు చేశాయ్..! ఆశావహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై దాదాపుగా స్పష్టత వచ్చింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 15 రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. టీ పీసీసీ పోస్ట్ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు జోరుగా లాబీయింగ్ చేశారు. కొద్దిరోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. చివరికి హైకమాండ్ ఎస్టీ నేత వైపు మొగ్గుచూపారని విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్త విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు మరోసారి ఢిల్లీ వచ్చారు. సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.
టీపీసీసీ పదవిని మహిళకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నను ఓ విలేకరి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వద్ద ప్రస్తావించగా.. సీఎం ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క ఉన్నారు. వీరితో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ జత కలువనున్నారు. ఆయన ఈ రోజు ఢిల్లీ వెళుతున్నారు. ముఖ్యనేతలంతా ఢిల్లీలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.
తెలంగాణ తదుపరి సీఎం ఎవరనేదానిపై తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఒకరినొకరు అభినందించుకోవడానికి హోటల్ ఎల్లాకు వచ్చారు.
కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. కొండల్రెడ్డి స్థానికేతరుడు అని గులాబీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొండల్రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలు తనను వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Telangana Elections: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.