Share News

Revanth Reddy: రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు రేపు.. ఒకే రోజు 4 నియోజకవర్గాల్లో

ABN , First Publish Date - 2023-11-19T21:56:28+05:30 IST

ఒక వైపు తన నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ.. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). రోజుకి 3 నియోజకవర్గాలకు తగ్గకుండా చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్(Congress) శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది.

Revanth Reddy: రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు రేపు.. ఒకే రోజు 4 నియోజకవర్గాల్లో

హైదరాబాద్: ఒక వైపు తన నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ.. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). రోజుకి 3 నియోజకవర్గాలకు తగ్గకుండా చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్(Congress) శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. ఒక వైపు ఆ పార్టీకి పాజిటీవ్ వేవ్స్ వస్తుండటం.. అధ్యక్షుడి పర్యటనలతో అధికార బీఆర్ఎస్(BRS) ని భయపెడుతోంది.

రోజు మాదిరిగానే రేపు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటించనున్నారు. నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలలో రేవంత్ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్ లో, 3 గంటలకు పరకాలలో, 6 గంటలకు ఖైరతాబాద్ లో, 8 గంటలకు నాంపల్లిలో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-19T21:58:08+05:30 IST