Share News

Revanth Reddy: కేసీఆర్‌కు కూడా చర్లపల్లి జైలులో డబుల్‌బెడ్ రూం కట్టిస్తా..!

ABN , First Publish Date - 2023-11-23T15:23:47+05:30 IST

Telangana Elections: దుబ్బాకకు రావలసిన నిధులు మామ అల్లుళ్ళు సిద్దిపేటకు తరలించుకు పోయిండ్రని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ మాట్లాడుతూ.. మూడేండ్లలో రఘునందన్ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పిన బీజేపీ ఎమ్మెల్యేకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.

Revanth Reddy: కేసీఆర్‌కు కూడా చర్లపల్లి జైలులో డబుల్‌బెడ్ రూం కట్టిస్తా..!

సిద్దిపేట: దుబ్బాకకు రావలసిన నిధులు మామ అల్లుళ్లు సిద్దిపేటకు తరలించుకు పోయిండ్రని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై ఆరోపించారు. గురువారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ మాట్లాడారు. మూడేండ్లలో రఘునందన్ రావు (Raghunandan Rao) ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పిన బీజేపీ ఎమ్మెల్యేకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ (BJP) రాజకీయ కుమ్ములాటల్లో రఘునందన్ మునిగిపోయారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అని, ప్రజలకు బొందల తెలంగాణగా మారిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను బక్కోన్ని అని అంటున్నాడు కేసీఆర్. బక్కోనికి బుక్కెడు బువ్వ, రెండు పెగ్గుల మందు కావాలి. కానీ 10 వేల ఎకరాలు మింగినవ్. ఆ పక్క హరీశ్ రావు (Harish Rao), మరోపక్క కేటీఆర్ (KTR) ఉండి దుబ్బాకను ఎందుకు బంగారు తునుక చేయలేదు’’ అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.


ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500 లేకే గ్యాస్ సిలిండర్, ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు, తులం బంగారం, వ్యవసాయానికే కాదు గృహావసరాలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా అందజేస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు రాదని కేసీఆర్ చెబుతున్నారని... కేసీఆర్ మతిపోయి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుందో తెలియడం లేదని విరుచుకుపడ్డారు. రైతుకే కాదు.. భూమి లేని పేదలకు కూడా రూ.12000 రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల విద్యకు రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. ఈ నెల కేసీఆర్ ఉంటే 2 వేలే అని.. వచ్చేనెల కేసీఆర్ సర్కారును బొంద పెడితే రూ.4 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు కూడా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని సెటైర్ విసిరారు. కేసీఆర్‌తో పాటు ఆయన కొడుకు, బిడ్డ ఉండడానికి ఖచ్చితంగా ఇలు కట్టిస్తానన్నారు. కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-23T16:32:54+05:30 IST