Home » Tollywood
నటుడు లోబో.. టాటూ ఆర్టిస్టుగా కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత యాంకర్ గా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. డ్రెస్సింగ్, మేకప్కి ప్రసిద్ధి చెందిన లోబో అనేక టెలివిజన్ షోలలో కనిపించి, యాంకర్గా సత్తా చాటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షోలో కూడా లోబో పాల్గొన్న విషయం తెలిసిందే.
చిరంజీవిగా ప్రేక్షకులను రంజింపచేసి ధ్రువ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఆయన జీవితం వెల కట్టలేని జీవిత పాఠమని పేర్కొన్నారు.
18 రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ సినిమా షూటింగ్స్ రేపటి నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో టాలీవుడ్ వివాదం కొలిక్కి వచ్చింది. లేబర్ కమిషనర్..
సినీ కార్మికుల వేతనాల పెంపుపై జరుగుతున్న చర్చలు క్రమక్రమంగా కొలిక్కివస్తున్నాయి. 4 షరతులు, పర్సంటేజీ విధానాన్ని వివరిస్తూ ఫిల్మ్ ఛాంబర్.. ఫిల్మ్ ఫెడరేషన కు ఒక లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రేపు ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశం కానుంది.
తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికుల గౌరవ వేతనాల కోసం చేస్తున్న పోరాటం 13వ రోజులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ న్యాయమైన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఫిలిం ఫెడరేషన్ ఆందోళనను మరింత ఉధృతం చేసింది.
టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులు అయింది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు ఫిల్మ్ ఛాంబర్ సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్..
అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం చిత్రం పరదా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలో చిత్ర బృందం సందడి చేశారు.
సినీ కార్మికుల వేతనాలను యాభై శాతం పెంచుతాం.. కానీ తమ సినిమాల పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారని నిర్మాత ఎస్కెఎన్ ప్రశ్నించారు. ఆ బాధ్యత సినీ కార్మికుల సంఘాలు తీసుకుంటాయా అని నిలదీశారు. రైట్స్ కాదు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలన్నారు. చిన్న సినిమాలకు తగ్గట్టుగా వేతనాలను కార్మికులు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్తో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సమావేశం కానున్నారు. ఏపీ సచివాలయంలో ఈ భేటీ జరుగనుంది. తెలుగు ఫిలింఫెడరేషన్ స్ట్రైక్, వారి సమస్యలపై ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్తో ప్రధానంగా చర్చించనున్నారు.
సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ పాత్ర ఉండదని, ఇది ఫిల్మ్ ఛాంబర్కు సంబంధించిన వ్యవహారమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ క్లారిటీ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం మంత్రి కందుల దుర్గేశ్తో సమావేశం అయ్యారు.