Home » TG Govt
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
హైదరాబాద్లోని అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో హైడ్రా అధికారులు శనివారం భారీ కూల్చివేతలు చేపట్టారు. హస్మత్పేట్ ప్రాంతంలోని సర్వే నంబర్-1 చత్రిగడ్డ వద్ద అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు రంగంలోకి దిగారు.
తమ ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ విజన్ దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని తెలిపారు.
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్నలకు ఎన్నడూ లేనంత ధరలు పలికాయి.
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి పోర్టల్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు(ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్) 15 నెలలుగా వేతనాలు లేవు.
తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద యోగా దినోత్సవంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.