Home » terror attack
నవంబర్ 10వ తేదీన ఉమర్ నబీ అనే వ్యక్తి ఎర్రకోట దగ్గర ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 13 మంది చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
గత సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఐ-20 కారు నుంచి విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. ఈ కేసు విచారిస్తున్న అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు
ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బాంబ్ బ్లాస్ట్ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సంఘటనా స్థలం దగ్గర తాజాగా మూడు 9 ఎమ్ఎమ్ కాట్రిడ్జ్లు దొరికాయి. వాటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్లు కాగా.. మరొకటి ఖాళీ షెల్. బాంబు పేలిన చోటులోకి ఈ మూడు కాట్రిడ్జ్లు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డిసెంబర్ 6న భారీ ఉగ్ర దాడికి ప్లాన్ జరిగింది అందుకోసమే ఈ 32 కార్లను కూడా ఉగ్రవాదాలు సిద్ధం చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ 32 కార్లతో ఢిల్లీతో సహా దేశంలోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడుల కోసం ఉపయోగించాలని అనుమానిత ఉగ్రవాదులు భావించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు దాడుల కోసం ఐ20, ఎకోస్పోర్ట్ వంటి కార్లను ఎంపిక చేసుకుని.. వాటిని పేలుడు పదార్థాలను నింపేందుకు వీలుగా మాడిఫై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. వారినుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. సోమవారం ఎర్ర కోట దగ్గర బాంబు దాడికి పాల్పడింది ఉమరేనని దర్యాప్తులో తేలింది. ఐ20 కారు దగ్గర సేకరించిన డీఎన్ఏతో నిందితుడు ఉమర్ నబి బంధువుల నుంచి సేకరించిన డీఎన్ఏ సాంపిల్స్తో మ్యాచ్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు యావత్ భారతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ చెకింగ్స్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు..
దేశంలో మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక టీమ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది.
ముంబై ఉగ్రదాడుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరం బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ప్రపంచం అంతా యుద్ధం ప్రారంభించవద్దని చెప్పడానికి ఢిల్లీకి వస్తోందని, నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ ప్రత్యేకంగా తనను, ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వచ్చారని చిదంబరం తెలిపారు.
ధర్మవరంలో నూర్ మహమ్మద్ షేక్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్కు పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) గుర్తించింది.