Home » Telugu Desam Party
విధేయత, సీనియారిటీ కలబోతే ప్రామాణికంగా ఎన్టీఆర్ జిల్లాలో నలుగురికి కార్పొరేషన్ చైర్మన్లుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. పార్టీ జెండాను అంటి పెట్టుకుంటూ విజయంలో తమ వంతు పాత్ర పోషించిన వారికి సముచిత గుర్తింపును ఇచ్చింది.
ఈ మేరకు ప్రతి గ్రామంలో ఫేకల్ స్లజ్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 77 FSTP ప్లాంట్ల నిర్మాణానికి రూ.115.5 కోట్ల మంజూరు చేస్తూ.. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించింది
154 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని మంత్రి డోల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఈరోజు పులివెందులలో కూడా వైసీపీ ఓటమి ఖాయమని.. వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. ఓటమిని జీర్ణించుకోలేక రెక్కింగ్ చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి డోల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు.
తెలుగుదేశం ఒంగోలు నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో నిందితుడు ముప్పా సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేశాడు. సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ (సోమవారం) జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం విచారణ జరిపింది.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలుగుదేశం ఎంపీలు సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని టీడీపీ ఎంపీలు విజ్ణప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల ప్రధానికి ఎంపీలు అభినందనలు తెలిపారు.
మ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్చుప్గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్రెడ్డి బరిలో ఉన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలందరూ జగన్కి జ్ఞానోదయం చేయాలని హితవు పలికారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
పులివెందులల్లో సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. ఏపీ నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్లు వచ్చారని చెప్పుకొచ్చారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకొని తమపై నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీటెక్ రవి ధ్వజమెత్తారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల, టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.