Home » Telangana Politics
నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర (Jana Jathara) భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో ఎటుచూసినా జనాలే కనిపిస్తున్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని మాటిచ్చారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందే.. వారికి న్యాయం జరగాల్సిందేనని భవిష్యత్లో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు..
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. అయినా అయినా గ్రేటర్లో లోక్సభ ఎన్నికల సందడి అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. అభ్యర్థులు ఇప్పటివరకు కూడా పూరి స్థాయి పర్యటనలకు సైతం శ్రీకారం చుట్టలేకపోతున్నారు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి రేవంత్రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు వడ్డీలను చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను
పాత బస్తీకి(Hyderabad Old City) చెందిన మైనార్టీ కీలక నేతకు బీజేపీ(BJP) గాలం వేసినట్లు తెలిసింది. సికింద్రాబాద్(Secunderabad), హైదరాబాద్(Hyderabad) గెలుపులో దోహదపడే అవకాశం ఉండడంతో ఆయనను చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ(Telangana Assembly) ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) తరఫున పలుమార్లు పోటీ చేసిన ఆ నేత స్వల్ప ఓట్లతో..
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy).. కవిత జాగృతి సంస్థకు ..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో(Lok Sabha Elections 2024) రాష్ట్రంలోకి డబ్బు, మద్యం అక్రమ రవాణా కట్టడికి తెలంగాణ పోలీసులు(Telangana Police) కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు.. పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లా పోలీసు అధికారులు, కేంద్ర బలగాల అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లో(Hyderabad) కృత్రిమ కొరత సృష్టించి జలమండలిని(HMWSSB) తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ‘నీటి కుట్రలు’ పన్నిన్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సరిపడా నీళ్లున్నప్పటికీ సరఫరా చేయకపోవడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన ఫోన్ట్యాపింగ్ కేసులో(Phone Tapping) సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీసు అధికారులు, మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు(Political Leaders) ఉన్నట్లు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు(Radha Kishan Rao) విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు(Local Body Elections) జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి(CM Revath Reddy) వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) క్షేత్రస్థాయి నేతల పనితీరును బట్టి ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
సొంత వర్గం నేతల నుంచే కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయంలో రాజు జాగ్రత్తగా ఉండాలి’... ఇదీ సరిగ్గా ఏడాది క్రితం బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన శోభకృత్ ఉగాది(Ugadi) వేడుకల సందర్భంగా పంచాగకర్త, వేదపండితుడు సంతోష్ కుమార్ శాస్త్రి అప్పటి సీఎం కేసీఆర్ను(KCR) ఉద్దేశిస్తూ చేసిన సూచన ఇది!