Home » Telangana DGP
గత 33 సంవత్సరాలుగా ఏపీ, తెలంగాణలో పోలీస్ శాఖలో కీలక పదవుల్లో పని చేశానని డీజీపీ జితేందర్ చెప్పారు. పంజాబ్లో పుట్టి పెరిగానని.. పోలీస్ శాఖలో ఉండి ప్రజలకు సేవ చేయడం మర్చిపోలేని అనుభవం అని అన్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. సహాయక చర్యలు వేగంగా చేపడుతున్నామని తెలిపారు.
NHRC Notice: తెలంగాణ ప్రభుత్వం, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్లో యువకుడి మృతికి సంబంధించి సమాధానం చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది.
Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీ కోసం ప్రభుత్వం కసరత్తు పూర్తి అయ్యింది. మొత్తం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ల పేర్లను యూపీఎస్సీకి సర్కార్ పంపించింది.
Telangana: ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రిలోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హైదరాబాద్, జులై 19: పోలీసు సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్ చేసి సామాన్య ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాళ్ల విషయంలో అలర్ట్గా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన..
తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాజ్భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మరింత దూకుడుగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Telangana: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోశామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనికుమార్, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు డీజీపీ, పోలీస్ ఆఫీసర్స్ నివాళులర్పించారు.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ విభాగం అప్రమత్తం అయ్యింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.