Home » Stock Market
రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని భారత్, చైనాలకు నాటో దేశాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం కూడా మార్కెట్ల ఒడిదుడుకులకు కారణమవుతోంది.
కనిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం కూడా మార్కెట్లకు కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు (జూలై 14, 2025) కూడా పడిపోయాయి. ఐటీ రంగం 1.1 శాతం నష్టంతో మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందా?. అసలు ఐటీ రంగం ఎందుకు పడిపోయిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఐటీ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కాఫర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధించడం, ఫార్మా ఉత్పత్తులపై కూడా భారీ పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
భారత స్టాక్ మార్కెట్లో ప్రతి వారం కూడా కొన్ని కొత్త ఐపీఓలు వస్తున్నాయి. ఇదే మాదిరిగా వచ్చే వారం కూడా మూడు కంపెనీలు తమ IPOలను ప్రారంభించబోతున్నాయి. వీటిలో స్పన్వెబ్ నాన్వోవెన్, మోనికా అల్కోబెవ్, ఆంథెమ్ బయోసైన్సెస్ IPOలు ఉన్నాయి.
ఐటీ, ఆటో, ఎనర్జీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి శుక్రవారం మార్కెట్ను కుంగదీసింది.
కాఫర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధించడం, ఫార్మా ఉత్పత్తులపై కూడా భారీ పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఆయా రంగాలు నష్టాల బాట పట్టాయి. మిగిలిన రంగాలు స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి
ఈ రోజు (జులై 9)తో పలు దేశాలపై అమెరికా విధించిన వాణిజ్య సుంకాల డెడ్లైన్ ముగిసింది. ఆ డెడ్లైన్ను ఆగస్ట్ 1వరకు పొడిగించిన ట్రంప్ ఆ తర్వాత ఇంక పొడిగించేది లేదని స్పష్టం చేశారు. అలాగే కాపర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
ఈ రోజు ఆసియా మార్కెట్లన్నీ ఊగిసలాట ధోరణిలోనే కదులుతున్నాయి. అదే రీతిలో భారత స్టాక్ మార్కెట్లు కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. బ్యాంకింగ్ రంగం మాత్రమే లాభాలతో ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం పరిమిత శ్రేణిలోనే కదలాడినప్పటికీ, ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాటలకు లోనయ్యాయి.