Home » Srikakulam
శ్రీకాకుళం: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారం చేపడతాయని, వైసీపీ కుక్కలు, సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని.. దేశంలో పొత్తులు కొత్త కాదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్ను తాకలేదు. మబ్బుల కారణంగా కిరణ స్పర్శకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.
నీవంటే నాకు ఇష్టం.. పెళ్లి చేసుకొని కలిసి జీవిద్దాం... అని చెప్పి కొన్నాళ్ల తరువాత మోసం చేసి వెళ్లాడని ఓ మహిళ మధురానగర్ పోలీ్సస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
జిల్లాలోని పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి అక్రమ రవాణా సమాచారంపై తనిఖీలు చేస్తున్న పోలీసులను ఓ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఈబీ ఎస్సె ప్రభాకర్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా: ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేక హోదా తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారని, ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని జగన్ మాయ మాటలు చెప్పారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.
శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరంలో ఓ అరుదైన చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే పులిబుగ్గ సొరచేప తీరానికి కొట్టుకువచ్చింది.
AP Elections 2024: ‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లోనూ కలవరం రేపుతోంది.
Andhrapradesh: ఎన్నికలను పర్యవేక్షించేది రెవెన్యూ శాఖ అని.. రెవెన్యూ శాఖ మంత్రి బరితెగించి వాలంటీర్లను ఎన్నికలు ప్రచారం చేయండని చెప్పడం ఏంటి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎవడబ్బ సోమ్ము తో డబ్బులిస్తున్నావ్ వాలంటీర్లకు. వాలంటీర్లకు ఇచ్చేది మీ బాబు సొమ్ము కాదు. ధర్మాన, జగన్ ఇంట్లో సొమ్ము ఇవ్వడం లేదు.. ప్రభుత్వ సోమ్ము ఎన్నికల ప్రచారం కోసం ఎలా వాడుతారు’’ అని ప్రశ్నించారు.
Andhrapradesh: వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. గురువారం రాజాం శంఖారావం సభలో యువనేత మాట్లాడుతూ... సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయన్నారు. దొంగ ఓట్లు నమోదు చేసే అధికారులు జైలుకు వెళ్తారని ఆనాడే చెప్పామని.. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు.
25కు 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారని, వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారని నారా లోకేష్ ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి వైసీపీ ఎంపీలే ముఖం చాటేస్తున్నారని, జగన్ డిల్లీ వెళ్లితే 31మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారని.. వారు బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.