Home » Siddaramaiah
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్ల క్యారికేచర్లతో కృత్రిమ మేథస్సును ఉపయోగించి రూపొందించిన ఈ వీడియో 26 సెకన్ల పాటు ఉంది. ఇందులో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కలిసి డీకే శివకుమార్కు 'హాయ్' అంటూ వాట్సాప్ మెసేజ్ పంపుతారు.
కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు దివంగత మాజీ ముఖ్యమంత్రి డి దేవరాజ అర్స్ (D Devaraja Urs)కు ఉంది. ఆయన సుమారు 7.6 సంవత్సరాలు అంటే 2,792 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదున్నరేళ్ల పాలనలో రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు జరగవచ్చని కొందరు ఊహాగానాలు చేస్తుండగా, కొందరు ఈ పరిణామాలను 'నవంబర్ రివల్యూషన్'గా పిలుస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృ భాషలోనే దేశ ఆలోచనా విధానం, లెర్నింగ్, డ్రీమ్స్ ఉంటాయని, ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నమని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బెళగావి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ కెరీర్ చివరి దశలో ఉందన్నారు. ఈ పరిస్థితిలో బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు కావాలని, ఆయనకు సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారని చెప్పారు.
తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదమైనట్టు తెలియగానే వివరణ ఇచ్చానని యతీంద్ర చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీలోనే మాట్లాడతానని, మీడియా ముందు మాట్లాడనని అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోనుండటం, రొటేషనల్ పద్ధతిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు పదోన్నత కల్పించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వస్థీకరణ చోటుచేసుకోనుంది.
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులు జరుగనున్నాయని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చే నవంబర్లో రెండున్నరేళ్లు పాలన పూర్తి చేసుకోనుంది.
కొద్ది రోజులుగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై కిరణ్ మజుందార్, డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం సాగుతూ వచ్చింది. బెంగళూరు రోడ్లు, చెత్తతో తాను ఇబ్బందులు పడినట్టు ఒక విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలపై మజుందార్ స్పందించడం చర్చనీయాంశమైంది.
ప్రధాన అంశాల నుంచి దారి మళ్లించేందుకు బీజేపీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతోందని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా నిందించడానికి బదులు ఆర్ఎస్ఎస్ తరఫున ఎందుకు మాట్లాతున్నారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.