Home » Sangareddy
అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలు రాత్రి నిద్రపోయినవారు నిద్రపోయినట్లుగా ప్రాణాలొదలడం.. పక్కనే నిద్రించిన తల్లి అర్ధరాత్రి తర్వాత కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన ఘటన గుర్తుందా? వారం క్రితం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన ఈ ఘటనలో వేళ్లన్నీ భర్తవైపే చూపాయి.
Ameenpur Case Twist: అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ బయటపడింది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.
ఆ దంపతులకు పదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. రాత్రి చిన్నారులతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున భార్య కడుపునొప్పి భరించలేక హాహాకారులు చేయగా.. పడుకున్న ముగ్గురు పిల్లలు పడుకున్నట్లుగానే చనిపోయి ఉన్నారు.
డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక ఫస్ట్ పర్సన్ వ్యూ (ఎఫ్పీవీ) కమికాజె (ఆత్మాహుతి) డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం పంజాబ్లోని పఠాన్కోట్లో నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు సామగ్రితో వెళ్లిన డ్రోన్ దాన్ని సమర్థంగా పేల్చివేసింది.
హోలీ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో తన చిన్ననాటి మిత్రులు, సన్నిహితులు, స్థానిక ప్రజలపై రంగులు చల్లారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటమే ఇందుకు కారణం. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం సమీపంలోని ఓ పౌల్ర్టీఫాంలో మూడు రోజుల వ్యవధిలో ఏడు వేల కోళ్లు మరణించాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఆవిష్కరణలకు కేంద్ర బిందు వు కావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు.
Road Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు మృత్యువాతపడ్డారు. వారణాసిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ, అతడి భార్య ఈ ప్రమాదంలో మరణించారు.
ఆ స్థలాలు వారి తాతముత్తాల నుంచి వారసత్వంగా వచ్చాయి. స్థలాల పత్రాలు వారి పేరిటే ఉన్నాయి. ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. కానీ అవన్నీ సర్కారు స్థలాలని తాజా రికార్డులు చెబుతుండటంతో ఆ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.