Home » RJD
గెలుపు పక్కా అంటూ ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు రాఘోపూర్లో బీజేపీ నేత సతీశ్ కుమార్ యాదవ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. మొదట్లో సతీశ్ ఆధిక్యంలోకి రావడం ఆర్జేడీ వర్గాలను కాస్త టెన్షన్ పెట్టింది. అయితే, చివరకు తేజస్వీ 14 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు.
ఈసారి ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు గత ఎన్నికల్లో మహాగఠ్బంధన్లోని ఆర్జేడీ, కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈసారి తగ్గే అవకాశం ఉంది.
నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు..
పోల్ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి పదవికి 33 శాతం మద్దతుతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. నితీష్ కుమార్ 29 శాతంతో ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్లు చెరో 10 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు.
వివిధ నియోజకవర్గాల్లో పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండటం, పార్టీ నామినీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు వస్తున్న వార్తలతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు ఆర్జేడీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్ర యంత్రాంగం అవినీతిమయమైందని, శాంతిభద్రతలు లోపించాయని తేజస్వి ఆరోపించారు. సీమాంచల్ ప్రాంతాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
మహాఘట్బంధన్ అధికారంలోకి వస్తే బిహార్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులకు అలవెన్సులు రెట్టింపు చేస్తామని, రూ.50 లక్షల బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. కూటమి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సహానితో కిలిసి మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు.
బిహార్లోని సహర్సాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన తరగతుల వాణిని వినిపించేందుకు ముఖేష్ సాహ్నీ డిప్యూటీ సీఎంగా ఉంటారని, ఆయనతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరింత మంది ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని చెప్పారు.
బిహార్ మహాఘట్బంధన్.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను అధికారికంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే మాటల యుద్ధం మొదలైంది. ఆర్జేడీ నేత అయిన తేజస్వి సవాలుకు ఎన్డీయే నేతలు అంతే రేంజ్ లో విమర్శలు గుప్పించారు.