Home » Rajasthan
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశం భగ్గుమంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్' కలల సాకారానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అవినీతిని నిర్మూలించాలని మోదీ చెబుతుంటే, అవినీతిని కాపాడంటంటూ వారు చెబుతున్నారని ప్రధాని విమర్శలు గుప్పించారు.
ఈ సారి ఐపీఎల్ షెడ్యూల్, వేదికల విషయంలో బీసీసీఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సమస్యలు తప్పేలా లేవు. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ రెండు విడతల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 22 నుంచి ప్రారంభమైన లీగ్ మొదటి విడతలో 21 మ్యాచ్లకు బీసీసీఐ షెడ్యూల్ను విడుదల చేసింది.
జైపూర్లోని సవాయి మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
Rajasthan: భార్యభర్తల మధ్య గొడవలు జరిగి.. భార్య(Wife) తన పుట్టింటికి వెళ్లడం.. ఆ తరువాత భర్త(Husband) బ్రతిమాలి మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లడం పలు సందర్భాల్లో జరుగుతుంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో పుట్టింటి నుంచి మెట్టినింటికి రావడానికి ఆ భార్య తన భర్తకు(Wife and Husband) కొన్ని కండీషన్స్ పెడుతుంటుంది.
హాస్టల్ విద్యార్థి ఎంతకీ గది తలుపులు తెరవకపోవడంతో అందరిలో టెన్షన్! అతడు గాఢ నిద్రలో ఉన్నాడని తెలిసీ వెల్లివిరిసిన నవ్వులు
శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రాజస్థాన్లోని కోటలో శుక్రవారం ఉదయం జరిగిన ఊరేగింపులో విద్యుదాఘాతంతో సుమారు 14 మంది చిన్నారులు గాయపడ్డారు.
కోవిడ్ భయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అడపాదడపా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఘాటుగా విమర్శలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనలో దేశం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.ఆ పార్టీకి ఎప్పుడూ దేశ భవిష్యత్తుపై ఆలోచనలేదని విమర్శించారు. ఇప్పుడు దేశం ఎంతో ధీమాగా ముందుకు దూసుకు వెళ్తోందని చెప్పారు. శుక్రవారం జరిగిన 'వికసిత్ రాజస్థాన్' కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.