Home » Rains
జిల్లాలో అకాల వర్షం భారీగా కురిసింది. శుక్రవారం వేకువజామున ఓవైపు ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా.. మరోవైపు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం 8 గంటల తర్వాత ఎండకాచినా.. మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్లీ వాతావరణం మారిపోయింది.
రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర సహా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఒక వైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
తమిళనాడు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో వాతావారణ శాఖ చల్లటి వార్త చెప్పింది.
ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే మూడు గంటల వ్యవధిలో పిడుగులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలోని ములుగు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల తీరప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం పడింది. కొన్నిచోట్ల ఈదరుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది.
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడుతోంది. నిజాంపేట్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, జగద్గిరిగుట్ట, షాపూర్నగర్లో భారీ వర్షం కురుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నాడు ద్రోణి ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.