Home » Rains
తుపాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అంశాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మొంథా తుపాను విజయవాడ ప్రజలను భయభ్రాంతులకి గురిచేస్తోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలువులు ప్రకటించారు.
మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపానుగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలిందని వెల్లడించారు ప్రఖర్ జైన్.
మొంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం తిరుమలలో వేకువజాము నుంచే ముసురు వాతావరణం కనిపించింది. చిరుజల్లులే కావడంతో భక్తులకు పెద్దగా అసౌకర్యం కలుగలేదు. ఉండిఉండీ దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్న ‘మొంథా’ తుఫాన్.. తమిళనాడులో గుబులు పుట్టిస్తోంది. దీని తీవ్రత భారీగా వుం టుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో. ఎటు నుంచి ఎటు వెళ్తుందోనని రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా వుండగా తుఫాను కారణంగా భారీ వర్షం పడే అవకాశముండడంతో మంగళవారం తిరువళ్లూర్ జిల్లాకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.
నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420కిలోమీటర్ల, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఏపీవ్యాప్తంగా 12 జిల్లాల్లో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉందని చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్.
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖా తంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని అధికారులు తెలిపారు.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, స్యూయిజ్లు, సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.