Home » Railway News
చర్లపల్లి నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్(12604)కు నాయుడుపేట్లో అదనపు స్టాపేజీ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి నాయుడుపేట్ రైల్వే స్టేషన్లో రెండు నిమిషాల పాటు రైలు ఆగుతుందని (హాల్టింగ్) దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రాబోయే పండుగ సీజన్కు ముందే మీరు ఇంటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? భారత రైల్వే మీ కోసం అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, చౌకగా మారుస్తూ, రైల్వే ప్రత్యేకంగా రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్ను ప్రకటించింది.
Fire Incident: గురువారం మొబైల్ రెస్ట్ బోగి లూప్లైన్లో నిలిచి ఉంది. ఏమైందో ఏమో తెలీదు కానీ, ప్రమాదవశాత్తు బోగిలో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకున్న సమయంలో బోగిలో ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు.
Police Rescue Passenger: లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత రైలు రానే వచ్చింది. అయితే, రైలు ఆగి వెళ్లేంత వరకు అతడు లోపలికి ఎక్కలేదు. రన్నింగ్లో ఉన్న రైలులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. రైలులోకి ఎక్కుతుండగా పట్టుతప్పింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున వేర్వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే పలు రైళ్లను అక్టోబరు 19వ తేదీ వరకు ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఐటీఐ పూర్తి చేసి, రైల్వేలో ఉద్యోగం చేయాలని చూస్తున్న వారికి కీలక అలర్ట్. ఎందుకంటే రైల్వేలో 6,238 టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసేందుకు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Jan Sadharan Express Derails: బోగీలు పట్టాలు తప్పిన సమయలో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ శబ్ధం వినపడగానే కొంతమంది ప్రయాణికులు భయపడిపోయారు. రైలులోంచి కిందకు దూకేశారు. అయినప్పటికీ వారికీ ఏమీ కాలేదు.
టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యువతకు రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 1,000 మందికి పైగా ఈ నియామాకం కింద నియమించుకోనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి.
హైటెక్ హంగులతో ఉప్పుగూడ రైల్వేస్టేషన్ను ఆధునీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకంలో భాగంగా రూ.26.81 కోట్లతో ఈ స్టేషన్లో చేపట్టిన పునరభివృద్ధి పనులు డిసెంబరు ఆఖరుకల్లా పూర్తి కానున్నాయని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టును రైల్వే పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి బిహార్ తరలిస్తున్న 56 మంది యువతులను కాపాడారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దుర్మార్గానికి పాల్పడిన ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.