Home » Railway News
మెుంథా తుపాన్ ముంచుకొస్తోంది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కదులుతున్న రైల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35)పై నిందితుడు జొన్నలగడ్డ రాజారావు అత్యాచారంచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్లో సంత్రగచి స్పెషల్ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ఫారం నంబరు 10లో మంగళవారం స్పెషల్ టాస్క్ఫోర్స్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గతంలో ఐఆర్సీటీసీ అకౌంట్ ఉంటే.. టికెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ బుక్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడేవారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
విశాఖ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ నవంబర్ నెల 4వ తేదిన ఉదయం 9.10 గంటలకు విశాఖలో బయలుదేరుతోంది. ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.
దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగుల కోసం కేంద్రం 78 రోజుల బోనస్ను ప్రకటించింది.
నిరుద్యోగులకు అలర్ట్.. భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారామెడికల్ స్టాఫ్ వివిధ పారామెడికల్ కేటగిరీల పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. సికింద్రాబాద్ (సనత్నగర్)- వాడి మార్గంలో 173 కి.మీ. పొడవైన 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం వేగంగా, సౌకర్యంగా ప్రయాణించాలనుకునే వారికి వందే భారత్ రైళ్లు మంచి ఆప్షన్గా మారాయి. ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా దేశంలోని 7 ప్రధాన మార్గాల్లో వందే భారత్ రైళ్ల కోచ్లను మరింత పెంచింది రైల్వే శాఖ.
ఈసారి గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకునేందుకు ఇళ్లకు వెళ్తున్నవారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ఈసారి (2025) గణపతి పండుగ కోసం మొత్తం 380 స్పెషల్ రైళ్ల ట్రిప్లను నడపబోతోంది. ఇదో రికార్డు స్థాయి సంఖ్య అని చెప్పవచ్చు.