Home » Railway News
రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ అమల్లోకి రావడంతో గుంతకల్లు డివిజన్ కుదింపునకు గురైంది.
తిరుపతి రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల్లేని కారణంగా భద్రతా విభాగం అయోమయ పరిస్థితిలో ఉంది.
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో రైల్వేప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు.
రైళ్లలో ఇటీవల జరిగిన వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉందని రైల్వే శాఖ తెలిపింది. అసాంఘిక శక్తుల ప్రమేయం ఇందులో ఉందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పేర్కొంది.
అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి రైల్వే సెక్షన్లో మూడో, నాలుగో లైన్లను నిర్మించాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు, నాలుగో రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో కార్మికులకు ప్రమాదం జరిగింది. థర్డ్ లైన్ పనులు చేస్తూ ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
భారతీయ వివాహాలంటేనే అట్టహాసాలు, హంగులు, ఆర్భాటాలు. సాధారణంగా పెళ్లి బృందం వెళ్లడానికి బస్సులు లేదా కార్లు బుక్ చేయడం చూస్తుంటాం. కానీ, ఓ కుటుంబం ఏకంగా రైల్ కోచ్నే బుక్ చేసింది. వివరాల్లోకి వెళితే..
రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించే దిశగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మద్యం, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ల ప్రకటనలను రైల్వే స్టేషన్ల పరిధిలో గానీ, రైలు బోగీలపై కానీ ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ రైల్వేశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. టెండర్లు పిలిచి ఐదు నెలలు కావస్తున్నా ఏ కాంట్రాక్టు సంస్థ కూడా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో బిడ్ల ఖరారు వ్యవహారాన్ని రైల్వే అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు.