Home » PV Narasimha Rao
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు.
బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేయనున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.
భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు చరిత్రను అందరికీ తెలిసేలా చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు( BJP MP GVL Narasimha Rao) అన్నారు. పీవీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన సందర్భంగా ‘‘నాలుగు మంచి మాటలు’’ పేరుతో బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని.. అయితే కాంగ్రెస్ ఈ విషయంపై హర్షం ప్రకటించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(BJP MP GVL Narasimha Rao) అన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ రాదా..? ఎందుకు కనీసం నోరు మెదపలేదు..? జాతీయ మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే కనీసం స్పందించలేదేం..? ఇంతకీ ఇంగ్లీష్ వచ్చా.. రాదా..? ఇప్పుడిదే అటు సోషల్ మీడియాలో.. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతున్న పెద్ద చర్చ. అసలేం జరిగిందో తెలిస్తే నవ్వుకుంటారేమో. ఇక ఆలస్యమెందుకు రండి మీ కళ్లతో చూసి.. చెవులారా విని తరించండి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలందరూ సంతోషించే విషయమని బీజేపీ ఎంపీ అరవింద్(Aravind) అన్నారు.
మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం హర్షించ దగిన విషయమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆలస్యమైనా పీవీకు భారతరత్న రావటం చాలా సంతోషంగా ఉందని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. పీవీ అజాత శత్రువని.. అన్ని పార్టీల్లో నాన్నకు మిత్రులున్నారని చెప్పారు. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లే భారతదేశం ఈ స్థితిలో ఉందని చెప్పారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నగా కేంద్రం గుర్తించడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. భారతరత్నగా పీవీని గుర్తించడం మోదీ గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు.