Share News

Bharat Ratna 2024: నేడు భారతరత్నలు ప్రదానం.. పీవీ తరపున అందుకోనున్న కుమారుడు..

ABN , Publish Date - Mar 30 , 2024 | 09:49 AM

బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేయనున్నారు.

Bharat Ratna 2024: నేడు భారతరత్నలు ప్రదానం.. పీవీ తరపున అందుకోనున్న కుమారుడు..

బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు(PV Narasimha Rao)తో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేయనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ(Delhi)లో జరిగే కార్యక్రమంలో ఐదుగురికి భారత రత్నలు ప్రదానం చేస్తారు.. నలుగురికి మరణాంతరం ఈ పురస్కారాలు ప్రకటించగా.. వీరిలో ఇద్దరు మాజీ ప్రధానులు ఉన్నారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌లకు కేంద్రప్రభుత్వం భారత రత్నలు ప్రకటించింది.

GVL Narasimha Rao: పీవీ నరసింహారావు చరిత్రను అందరికీ తెలిసేలా చేయాలి

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు భారత రత్న పురస్కారం అందుకోనున్నారు. పీవీ నరసింహరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, దేశ ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆర్థిక సంస్కరణలకు బీజం వేసింది పీవీ హయాంలోనే. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. దేశాన్ని ఆర్థికంగా పురోగమింపజేయడానికి బలమైన పునాది వేయడంలో పీవీ కీలకపాత్ర పోషించారు.

Aravind: పీవీను కాంగ్రెస్ అవమానపరిచింది

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2024 | 09:55 AM