Home » LK Advani
భారతీయ జనతా పార్టీ కేవలం ప్రతిపక్ష నేతలనే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా జైల్లో పెడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ మిషన్ని..
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణికి ప్రదానం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచుని ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూర్చుని ఉండటంపై జార్ఖాండ్ ముక్తి మోర్చా ఆక్షేపణ తెలిపింది. ఆమె గిరిజన మహిళ అయినందునే రాష్ట్రపతిని ప్రధాని అవమానించారని విమర్శించింది.
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ''భారత రత్న'' ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం ఉదయం స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేశారు.
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్కే అద్వానీకి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అద్వానీ నివాసంలోనే అవార్డు ప్రదానం చేయాలని నిర్ణయించారు.
బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేయనున్నారు.
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. జైల్లో ఉండాల్సిన ఆయనకు భారతరత్న ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కోసం 1990లో అద్వాణీ చేపట్టిన రథయాత్ర దేశంలో మతకల్లోహాలు సృష్టించిందని విమర్శించారు.
బీజేపీ అగ్రనేత లాల్కృష్ణ ఆడ్వాణీ(Lalkrishna Advani)కి అత్యున్నత ‘భారతరత్న’ ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంతో బీజేపీకి ప్రత్యేకించి ఆడ్వాణికి దశాబ్దాలకాలంగా సంబంధాలు ఉన్నాయి. దేశంలో బీజేపీ అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది.
మాజీ ఉప ప్రధాని, రాజకీయ భీష్ముడు, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
‘భారతరత్న’ పురస్కారం వరించడంపై మాజీ ఉప ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (LK Advani Bharat Ratna) తొలిసారి స్పందించారు. అత్యంత వినమ్రత ,కృతజ్ఞతతో ప్రదానం చేసిన 'భారతరత్న'ని తాను గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు.
‘భారత రత్న’ అవార్డుకు ఎంపికైన ఎల్కే అద్వానీ(LK Advani)కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభినందనలు తెలిపారు. భారత రాజకీయాల్లో అద్వానీ తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారని కొనియాడారు.