Share News

PV Narsimharao: ‘పీవీకి భారతరత్నఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది’

ABN , Publish Date - Mar 30 , 2024 | 02:29 PM

ఆలస్యం అయినా మట్టిలో మాణిక్యం పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వడం మంచి పని అని ఆయన మనవడు పీవీ సుభాష్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు. భారత ప్రధానిగా దేశం కోసం, ప్రజల కోసం ఆయన చేసిన మంచి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిపారు.

PV Narsimharao: ‘పీవీకి భారతరత్నఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది’

న్యూఢిల్లీ, మార్చి30 : ఆలస్యం అయినా మట్టిలో మాణిక్యం పీవీ నరసింహరావు ( PV Narsimharao )కు భారతరత్న(bharat ratna)ఇవ్వడం మంచి పని అని ఆయన మనవడు పీవీ సుభాష్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు. భారత ప్రధానిగా దేశం కోసం, ప్రజల కోసం ఆయన చేసిన మంచి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పీవీ నరసింహరావుకు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. ప్రధానిగా పీవీ నరసింహరావు చేసిన మంచి పనులను వారి ఖాతాలో వేసుకొని.. చెడు జరిగిందటూ పీవీని అవమానించారని ఆయన ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పీవీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఈ సందర్బంగా సుభాష్ రావు ధన్యవాదాలు తెలిపారు. మా తండ్రి పీవీ నరసింహరావుకు భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన కుమార్తె శారదా దేవి వెల్లడించారు. పీవీకి భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది పలువురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. వారిలో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత ఎం ఎస్ స్వామినాథన్, మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌ ఉన్నారు. న్యూఢిల్లోని రాష్ట్రపతి భవన్‌లో ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా ప్రదానం చేశారు. ఆ పురస్కారాలను వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. ఆ క్రమంలో పీవీ నరసింహరావుకు ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని ఆయన కుమారుడు పీవీ ప్రభాకరరావు అందుకున్నారు. ఈ భారతరత్న పురస్కార కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్నీ తెలంగాణ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2024 | 03:45 PM