Home » Puttaparthy
సత్యసాయి జయంతి ఉత్సవాలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైభవంగా సాగుతున్నాయి. సాయి భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చి సాయి సమాధిని దర్శించుకుంటున్నారు. ఐశ్వరరాయ్, సచిన్ టెండూల్కర్ ఇవాళ..
స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సవిత మండల నాయకులకు సూచించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.
పట్టణంలోని రాజీవ్గాంధీ సర్కిల్లో కూరగాయల మార్కెట్ నిర్వహిస్తుండటంతో వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. సంతరోజు ద్విచక్ర వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎనఎ్సఎ్స యూనిట్-2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం సోమవారంతో ముగిసింది.
కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ వెన్నంటే ఉంటుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భరోసా ఇచ్చారు. సోమవారం పట్టణంలోని సాయితేజ, కల్యాణమండపంలో క్లస్టర్ యూనిట్ బూత ఇన్చార్జ్లతో సమావేశం అయ్యారు.
పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ఒకనాటి గొల్లపల్లి గ్రామమే నేటి పుట్టపర్తి పట్టణం. ఒకప్పుడు గొల్లపల్లిలో గోపాలకులు ఎక్కువగా ఉండటంతో గొల్లపల్లిగా పిలిచేవారు. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం గోపాలకులు తమ పాడి ఆవులను మేతకోసం అడవికి తీసుకొని వెళ్లేవారు. ఒక ఆవు మాత్రం ప్రతి రోజు మంద నుంచి తప్పించుకుని అడవిలో మరో చోటుకు వెళ్లేది.
పోలీసు పహారాలో పుట్టపర్తి కొనసాగుతోంది. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 19న భారత ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తికి రానున్నారు.
కూటమి ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అం దేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గీత సూచించారు. సోమవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయశాఖాధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఈక్రాప్ నమోదు వందశాతం పూర్తయిందని, డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
మండల వ్యాప్తంగా ఉన్న రేషన షాపుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలింపును అరికట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు పెద్దన్న కోరారు. రెండు చోట్ల డంప్లు ఏర్పాటుచేసుకుని టెంపోలు, లారీలలో వాటిని తరలిస్తున్నట్లు ఆరోపించారు.