Home » Puttaparthy
అసలే ఆ గ్రామం ప్యాక్షనతో ఇబ్బందుల పాలైంది. ఇటీవలి కాలంలో ఎలాంటి తగాదాలు, సమస్యలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇలాంటి తరుణంలో మళ్లీ గ్రామప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది రస్తా సమస్య. మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో గడచిన 50 సంవత్సరాలుగా వాడుతున్న రస్తాను వారం రోజులక్రితం గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు రస్తాలేదంటూ దారికి అడ్డుగా గుంత తీయించింది.
సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తుల కోసం పుట్టపర్తి పట్టణంలోని ఫుట్పాత మీద పలు దుకాణాలు వెలిశాయి. బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాలకు చెం దిన వ్యాపారులు తాత్కాలికంగా పుట్పాతపై దుకాణాలు ఏర్పాటుచేసు కున్నారు. శత జయంతి వేడుకల కోసం వచ్చిన భక్తులు ఫుట్పాతఫై వెలసిన దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సత్యసా యి జయంతి వేడుకల్లో ఫుట్పాత వ్యాపారులు వెలయడం ఆనవాయితీ గా వస్తోంది.
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన పరిగి చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హిందూపురం కార్యాలయానికి చెందిన పలుశాఖల అధికారులతో ప్రజాదర్బార్ నిర్వహించారు.
భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు.
భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.
సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు.
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని హిల్ వ్యూ స్టేడియంలో అద్భుత ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సత్యసాయి సమాధిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.