Home » Punjab
అవినీతి కేసుకు సంబంధించి పంజాబ్లోని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో సీబీఐ రెయిడ్ నిర్వహించగా భారీగా నగదు పట్టుబడింది. రూ.5 కోట్ల నగదు, ఖరీదైన కార్లు, నగలు అధికారులకు చిక్కాయి
ధోతీ కట్టుకుని, పగ్డీ ధరించిన ఓ రైతు తన భార్యతో పాటు మెర్సండెస్ బెంజ్ షో రూముకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరికీ షో రూము వాళ్లు ఘన స్వాగతం పలికారు.
హర్చరణ్ సింగ్ పంజాబ్ మాజీ డీజీపీ మెహల్ సింగ్ బుల్లర్ కొడుకు కావటం గమనార్హం. హర్చరణ్ సింగ్ గత సంవత్సరం నవంబర్ నెలలో రోపర్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు.
మిలటరీపై కానీ, అధికారులపై కానీ తనకు ఎలాంటి అగౌరవం లేదని, అయితే స్వర్ణ దేవాలయం స్వాధీనం చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం మాత్రం సరికాదన్నదే తన అభిప్రాయమని చిదంబరం తెలిపారు. స్వర్ణ దేవాలయం స్వాధీనానికి ఆర్మీని దూరంగా ఉంచాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
పంజాబ్ వరదల్లో జరిగిన నష్టంపై కేంద్రం తక్షణమే పారదర్శక, కచ్చితమైన అంచనా చేపట్టాలని, సమగ్ర సహాయ పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.
పంజాబ్లోని ఓ కార్పొరేట్ బ్యాంకు బాత్రూమ్లో ఒక కస్టమర్ ఆత్మహత్య చేసుకున్నారు. సీనియర్ పోలీసు అధికారి తనను డబ్బుల కోసం వేధిస్తున్నాడంటూ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ ప్రజలకు అండగా నిలుస్తుందని, కష్టకాలంలో పూర్తి సహకారాన్ని అందిస్తుందని, ఇందుకు ప్రధాని పంజాబ్లో పర్యటించనుండటమే నిదర్శనమని బీజేపీ పంజాబ్ యూనిట్ తెలిపింది.
పంజాబ్లోని వరద ప్రభావిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 1998 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 48 మంది ప్రజలు చనిపోయారు.
పంజాబ్లో వరద బీభత్సం బారిన పడ్డ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రానికి చెందిన సెలబ్రిటీలు నడుం కట్టారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇది విరాళం కాదని, సేవ అని వ్యాఖ్యానించారు.
భగవంత్ మాన్ రెండ్రోజుల క్రితం వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వేకు బదులుగా ఆయన కాలినడకన ఆ ప్రాంతాల్లో పర్యటించారు.